Off The Record: సర్వే ప్రకారమే సీట్లు ఇస్తారా..? కాంగ్రెస్లో ఇది సాధ్యమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ సాధారణ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తోంది. ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులతో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ థాక్రే ఒక క్లారిటీ ఇచ్చారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని ప్రకటించేశారు. ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కదా అని పనిచేయకుండా టికెట్లు కావాలంటే కుదరదని తేల్చేశారు. పనిచేస్తేనే పదవులు, లేదంటే టికెట్ ఇచ్చేది లేదంటూ పీసీసీ చీఫ్ కూడా ప్రకటనలు చేశారు. కానీ.. ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీలో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇవ్వడం సాధ్యమేనా ? అసలది జరిగే పనేనా?
పార్టీ అధికారంలోకి రావాలంటే గెలిచే అభ్యర్థి ఎవరో తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుంచి పనిచేసే వాళ్లు కొందరు ఉంటారు.. డబ్బుతో జనంలో హడావుడి చేసేవారు మరికొందరు ఉంటారు. రెండూ ఉన్నవాళ్ళు ఇంకొందరు ఉంటారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వడం అనేది ప్రామాణికంగా పెట్టుకుని అందులో మెరిట్ని వెతికితే మంచిది. కానీ.. కేవలం సర్వేలనే ఆధారంగా చేసుకుని టికెట్లు ఇస్తే… దశాబ్దాల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని పక్కన పెట్టినట్టు అవుతుందన్న చర్చ మొదలైంది. కొన్ని నియోజకవర్గాలలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాంటి చోట్ల
పరిస్థితి ఏంటి? అన్నది ఇంకా క్లారిటీ లేదు. తుంగతుర్తి , జనగామ, సూర్యాపేట , దుబ్బాక, ఉప్పల్ , మునుగోడు లాంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా పాత కాంగ్రెస్ నేతలకు, కొత్తగా వచ్చినవారికి మధ్య వైరం ఉంది. ఇలాంటి పంచాయతీలు ఉన్నచోట నాయకులను పిలిచి మాట్లాడకుండా సర్వేలే ఫైనల్ అని చెప్పేస్తే… నష్టం జరుగుతుందన్న వాదన బలంగా ఉంది. ఒక నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారందరినీ పిలిచి నచ్చజెప్పాకే అభ్యర్థుల ఎంపిక జరగాలన్నది కొందరు సీనియర్లు చేస్తున్న సూచన. సర్వే రిపోర్ట్తో పాటు నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని కూడా చెరిపి కలిసి పనిచేసేలా కార్యాచరణ ఉండాలని సూచిస్తున్నారు. అయితే గతంలో కూడా పనితీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. పారాచ్యూట్ లీడర్స్కి టికెట్లు లేవని చెప్పిన రాహుల్ గాంధీ…. నామినేషన్ డెడ్లైన్కి ముందురోజు వచ్చిన నలుగురైదుగురికి బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది.
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
సర్వేలే ప్రామాణికం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు ఎంతవరకు ఆచరణ సాధ్యం అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. పార్టీ సమావేశాలకు రాని ప్రధాన కార్యదర్శుల పదవులను పీకేస్తామని ఇన్చార్జి ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి తొలగిస్తామని కూడా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. కాంగ్రెస్లో నాయకులు మాటలు చెబుతారు… తప్పా అవి అమలయ్యే వరకు నమ్మకం ఉండదన్నది గాంధీభవన్ సర్కిల్స్లో బలమైన నమ్మకం. ఇప్పుడు అంతా కర్ణాటక మోడల్ అని చెప్తున్నా… అక్కడ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యర్థులను ప్రకటించగలిగారు. మరి తెలంగాణలో అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయగలగా అంటే…. ఠక్కున ఎస్ అన్న సమాధానం మాత్రం రావడం లేదు. ఆ తరహాలో చేయగలిగితేనే ఫలితాల్ని రాబట్టగలుగుతామన్నది సీనియర్స్ మాట. అసంతృప్తులను బుజ్జగించకుండా ఎకాఎకిన అభ్యర్థులను ప్రకటిస్తే… జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ అన్న వాదన బలంగా ఉంది. పార్టీ అధిష్టానం ఈ సూచనలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!