Off The Record: కోనేరు కోనప్పకు కోపం వచ్చిందా..?
- ఆర్.ఎస్.ప్రవీణ్ బీఆర్ఎస్లో చేరాక కారు దిగేసిన కోనప్ప..
- లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా..
- కొన్నాళ్ళ తర్వాత కాంగ్రెస్తో కూడా టచ్ మీ నాట్..
- కాంగ్రెస్కు రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు..
- ఎమ్మెల్సీ దండే విఠల్ రాకతో కోనప్పకు ప్రాధాన్యం తగ్గిందా?.. నామ మాత్రంగా మిగిలిపోయానన్న ఫీలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్… జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే మన స్టైల్ అన్నట్టుగా ఉంటారట ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014లో బీఎస్పీ తరపున గెలిచి ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పంచన చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కోనప్ప. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్కు 44వేల 646 ఓట్లు వచ్చాయి. ఆయన ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయానని ఫిక్స్ అయిన కోనప్ప… తన ఓటమికి కారణం అయిన ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కారు దిగేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారాయన. చేరడం వరకు ఓకేగానీ… ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి తర్వాత కాంగ్రెస్తో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. అప్పటి నుంచి మళ్లీ కండువా మార్చేస్తారా..అనే ఊహగానాలు నడుస్తూనే ఉన్నాయి.
కాంగ్రెస్లో కోనప్పకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అంటున్నారు.ఎందుకంటే ఇక్కడ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి రావి శ్రీనివాస్ కోనప్పకు మేనల్లుడే. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు దండే విఠల్, హస్తం పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి సిర్పూర్లో తన ప్రాధాన్యత తగ్గిపోయినట్టు ఫీలవుతున్నారట కోనప్ప. ఎమ్మెల్సీకి అధికారిక ప్రోటోకాల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్కు పార్టీ ప్రొటోకాల్ ఉండగా తాను మాత్రం నామ మాత్రంగా మిగిలిపోయానని కోనప్ప ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. పైగా డీసీసీ అధ్యక్షులుగా వేరే వాళ్లు ఉండడంతో ఆయన వర్గానికి అసలు గుర్పింపే లేకుండా పోయిందని అంటున్నారు. ఇవే కాకుండా తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కష్టపడి సాధించిన బ్రిడ్జి నిర్మాణ అనుమతులు,రోడ్ల నిర్మాణాలను ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రద్దు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలోనే ఎన్నికలొస్తే స్వతంత్రంగా బరిలో నిలస్తానంటూ చేసిన తాజా కామెంట్స్ అధికారపార్టీలో కలకలం రేపుతున్నాయి. తాడోపేడో తేల్చుకోవడం కోసం అలా మాట్లాడారా…లేక పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యారా అనే చర్చ నడుస్తోంది ఉమ్మడి జిల్లాలో.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై కోనప్ప ఆరోపణలు చేయడంమే కాదు… ఎవ్వరొస్తే వారిని నిలదీయండని పిలుపునివ్వడంతో మాజీ ఎమ్మెల్యే దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. పనుల కోసం అధికారుల దగ్గరికి ఆయన తీసుకెళ్ళే ఫైల్స్ పక్కకుపోవడం, మంజూరు చేయించిన పనులు సైతం రద్దు చేయడం లాంటి పరిణామాలతోనే కోనప్ప అలా ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అంటున్నారు. తనకు గిట్టని వారి ప్రాధాన్యం పార్టీలో పెరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నది సమాచారం. పోనీ.. ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్లో చేరదామంటే…అక్కడ తన ఓటమికి కారణం అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ లో సైతం కొనసాగే పరిస్థితి లేదు. అందుకే ఇండిపెండెంట్ మాటలు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మనుషుల్ని స్వతంత్రులుగా నిలబెట్టి గెలిపించుకుని సత్తా చాటే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది జరగాలంటే ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. దీంతో కోనప్ప నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!