Off The Record: స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్కు చోటు.. ఎవరికి చెక్ పెట్టడం కోసం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టబోతోంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించే స్క్రీనింగ్ కమిటీని కూడా ప్రకటించేసింది. అయితే కమిటీ నియామకంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయట . పీసీసీ మాజీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డికి ఇందులో చోటు కల్పించడంపై చర్చ జరుగుతోంది. ఎవరికి చెక్ పెట్టడం కోసం ఆయన్ని స్క్రీనింగ్ కమిటీలో చేర్చారన్న దిశగా ఆ చర్చలు జరగడమే హాట్ హాట్గా మారింది. అభ్యర్థుల ఎంపికలో పాత కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నది చాలా రోజులుగా గాంధీభవన్లో వినిపిస్తున్న మాట. పార్టీలో కీలకంగా… ముఖ్య స్థానంలో ఉన్న నాయకుడు అందరిని కలుపుకొని పోవడం లేదని.. కొత్త కొత్త వారిని తీసుకువచ్చి అభ్యర్థులుగా ప్రకటిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్లు అధిష్టానానికి విన్నవించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఉత్తమ్ని కమిటీలో చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ఉన్న నాయకులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించి బయటకు పంపే కుట్రలు జరుగుతున్నాయన్నది ఎక్కువ మంది సీనియర్స్లో ఉన్న అభిప్రాయం అట. ఇదే అంశాన్ని పార్టీ అగ్ర నాయకుల దగ్గర ఉత్తం ప్రస్తావించినట్టు తెలిసింది. ఎన్నికల వేళ ఇలాంటివి జరగడం మంచిది కాదని సూచించినందునే రెండు వర్గాలను బ్యాలెన్స్ చేయడానికి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా ఉండే స్క్రీనింగ్ కమిటీలో ఉత్తంకుమార్ రెడ్డి పేరు చేర్చారని టాక్. పాత నాయకులను పక్కనపెట్టి కొత్తవారి డోస్ పెంచితే జరిగే నష్టం పై కూడా అధిష్టానానికి సీనియర్లు నివేదించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉన్నారు. ఉత్తం, భట్టి ఇద్దరూ పార్టీ కోసం పనిచేసిన సీనియర్స్కు అన్యాయం జరగకుండా చూస్తారని, లాయల్ గా పనిచేసిన వారిని పికప్ చేయడానికి ఉపయోగపడతారని అధిష్టానం భావించినట్లు చెబుతున్నారు. ఎవ్వరూ.. ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకోకుండా.. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని జాగ్రత్తగా కూర్చినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక కు సంబంధించిన ఎఐసిసి ముఖ్య నాయకుడు ఒకరు ఇటీవల పిసిసిలో కీలక నాయకుడికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో చర్చించినట్టు తెలిసింది. ఎంపికకు, సదరు వ్యక్తికి ఏంటి సంబంధం? అన్నది సీనియర్ల వాదన. ఇదే అంశాన్ని ఏఐసీసీ కీలక నాయకుల దృష్టికి తీసుకువెళ్ళారని, దీంతో … ఓ ముఖ్య నాయకుడిని కంట్రోల్ చేయడానికే వ్యూహాత్మకంగా కమిటీని వేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో స్క్రీనింగ్ కమిటీ నియామకంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ చెప్పిన సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో జరుగుతుందా..? లేదా అన్నది చూడాలి.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!