Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Bjp Lok Sabha Candidates In Telangana

Off The Record: తెలంగాణలో కమలం పార్టీ పాలసీ మారిందా?

Published Date :March 14, 2024 , 10:49 pm
By Sudhakar Ravula
Off The Record: తెలంగాణలో కమలం పార్టీ పాలసీ మారిందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయమై తెలంగాణలో అందరికంటే ఓ అడుగు ముందే ఉంది బీజేపీ. మొత్తం 17 స్థానాలకుగాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన వాటిలో ఐదు సీట్లు బీసీలకు ఇచ్చింది. అందులో కూడా ముదిరాజ్, గౌడ్, లింగాయత్‌లకు ఒక్కోటి చొప్పున, రెండు సీట్లు మున్నూరు కాపులకు కేటాయించింది. ఇక ఓసీలకు ఆరు టిక్కెట్లు దక్కాయి. అందులో బ్రాహ్మణ, వెలమలకు ఒక్కోటి చొప్పున, నాలుగు సీట్లు రెడ్లకు కేటాయించింది కమలం పార్టీ. ఇక రెండు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాల అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది. ఇంకా వరంగల్, ఖమ్మం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులల్లో సగానికిపైగా కొత్తవారే ఉండటంపై పార్టీలో చర్చ జరుగుతోంది. గెలుపు గుర్రాల పేరుతో పార్టీ లైన్‌ గురించి అవగాహన లేని వారు, కేవలం టిక్కెట్ల కోసమే పార్టీలో చేరిన వారిని ఎంకరేజ్‌ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

2019 లోక్ సభ ఎన్నికల కన్నా ముందు నుండి పార్టీలో ఉన్నవారు కేవలం నలుగురు మాత్రమే. రేపు ఒకవేళ ఓడిపోతే సదరు నేతలు బీజేపీలోనే ఉంటారన్న గ్యారంటీ ఉందా అన్న ప్రశ్న సైతం తలెత్తుతోందట. అదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకి చెక్ పెట్టి పార్టీ మారిన మాజీ ఎంపీ నగేష్‌కి టిక్కెట్‌ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని గత 15 రోజుల్లో బీజేపీలో చేరినవారు 8మంది ఉన్నారు. ఇందులో ఏడుగురికి బీజేపీ టిక్కెట్స్‌ ఇచ్చింది. ఇంకా చేరని, రెడీగా ఉన్న మరో నేతకు కూడా ఖాయమంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని పక్కన పెట్టి,… తమకో అవకాశం ఇవ్వాలని పార్టీలో ఉన్న పాత నేతలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా… కొత్త వారికే జై కొట్టింది పార్టీ అధిష్టానం. సిద్ధాంతాలు, పార్టీ కోసమే పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానాన్ని పక్కన పెట్టింది. గతంలో బీజేపీ పై విమర్శలు చేసిన వారిని, కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారికి సైతం టికెట్స్‌ ఇచ్చారన్న ఆవేదన కేడర్‌లో ఉందట. దశాబ్దాల తరబడి కష్టపడుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీలో.

మోడీ వేవ్‌ ఉన్నందున పాత వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుండేదన్న ఫీల్‌ పెరిగిపోతోందంటున్నారు పార్టీ నేతలు. మహబూబ్ నగర్ , మెదక్ స్థానాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం ఇవ్వడం ఓకే అనుకున్నా.. ఈ మధ్యనే జాయిన్ అయిన ఏడుగురికి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారిలో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ రాములు కుమారుడు భరత్‌, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, హైదరాబాద్‌లో మాధవీలత, పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్, నల్గొండకు సైది రెడ్డి, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను ఫైనల్‌ చేసింది పార్టీ. ఇక ఖమ్మం నుంచి జలగం వెంకటరావు పేరు దాదాపు ఖరారు అయినట్టేనని చెబుతున్నారు బీజేపీ నేతలు. వరంగల్ నుండి ఆరూరి రమేష్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆ సీటును ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఇటీవలే చేరిన వారు, చేరబోతున్నవారు అంతా కలిపి మొత్తం 9 మందికి తెలంగాణ కాషాయ టిక్కెట్స్‌ ఖరారయ్యాయి, అవుతున్నాయి. దీన్నే జీర్ణించుకోలేకపోతున్నారట పాత బీజేపీ నేతలు. ఎన్నికల్లో గెలుపు ముఖ్యమే అయినా… కేవలం టిక్కెట్‌ కోసమే కండువా కప్పుకున్నవారిని నెత్తిన పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అని అడుగుతున్నారట సగటు బీజేపీ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP Lok Sabha Candidates
  • off the record
  • telangana
  • TS Lok Sabha Elections

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions