Off The Record: ఏపీ బీజేపీ వ్యూహం మారుతోందా..? భిన్నమైన రాజకీయం చేయబోతోందా..?
- ముద్రలు చెరిపేసుకునే దిశగా ఏపీ బీజేపీ అడుగులు..
- బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచాలని నిర్ణయం..
- ఏపీలో ఓట్ బ్యాంక్ని పెంచుకునే దిశగా ప్లాన్స్..
- పార్టీ తరపున అంబేద్కర్ జయంతి వేడుకలు..
- క్షేత్ర స్థాయిలో కుల ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ కోసం ప్రణాళికలు..
- ఇచ్చిన అవకాశాల గురించి చెబుతూ ఆకట్టుకునే ప్లాన్..
- అరకు, పాడేరులో పార్టీకి 26 మంది ఎంపీటీసీలు..
- కులాల వారీగానే క్షేత్ర స్థాయి బలం పెరుగుతుందన్న లెక్కలు..
- ఎస్సీలకు దగ్గరవ్వాలన్న మెయిన్ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అది ఆంధ్రప్రదేశ్ అయినా…. ఉత్తరప్రదేశ్ అయినా… బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అని. అందులోనూ భేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే… బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి… బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే సరికొత్త కుల రాజకీయ సమీకరణలకు తెర లేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుని కూటమిలో సీట్ల బేరాన్ని గట్టిగా చేసే ప్లాన్ ఉందట కమలం పార్టీకి. అది జరగాలంటే… ముందు ఓట్ బ్యాంక్ని పెంచుకోవాలన్న దిశగా అడుగులేస్తోందట నాయకత్వం. ఇప్పటి వరకు తమకు దూరంగా ఉన్న వర్గాలను దరి చేర్చుకుని బలపడాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్… జయంతి వేడుకల్ని పార్టీ తరపున నిర్వహించాలని నిర్ణయించడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కుల ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ పెంచుకుంటేనే పార్టీ నిలబడుతుందన్న క్లారిటీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యులు ఆ దిశగా ఇప్పటివరకు ఇచ్చిన పదవుల గురించి ప్రచారం చేస్తూ ఆయా వర్గాలను ప్రభావితం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ బీసీయేనని, అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే కూడా బీసీలేనని, వెనుకబడిన వర్గాలకు తమ పార్టీ ఆ స్థాయి గుర్తింపు ఇస్తుందని ప్రచారం మొదలుపెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే…. అరకు, పాడేరు లాంటి చోట్ల పార్టీకి 26 మంది ఎంపీటీసీలు ఉన్నసంగతిని గుర్తు చేస్తున్నారు ఏపీ కమలనాథులు.
Also Read
- Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
- Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
- APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
- IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
పొత్తు ధర్మంలో భాగంగా తమ పార్టీకి వచ్చిన అవకాశాల్లో సింహభాగం ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు పార్టీ లీడర్స్. ఇలా…. ఓట్ బ్యాంక్ పెరగాలంటే… కులాల వారీగా క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడం ఒక్కటే మార్గం అని భావిస్తోందట ఏపీ బీజేపీ నాయకత్వం. సనాతన ధర్మం, హిందూ భావజాలం పేరుతో ఇతర కులాలు తమకు దూరం కాకుండా జాగ్రత్త పడాలన్నదే మెయిన్ టార్గెట్ అని, అందులో భాగంగా ప్రధానంగా ఎస్సీలకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ జపిస్తున్న కొత్త కుల మంత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!