Off The Record: ఏపీ బీజేపీ వ్యూహం మారుతోందా..? భిన్నమైన రాజకీయం చేయబోతోందా..?
- ముద్రలు చెరిపేసుకునే దిశగా ఏపీ బీజేపీ అడుగులు..
- బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచాలని నిర్ణయం..
- ఏపీలో ఓట్ బ్యాంక్ని పెంచుకునే దిశగా ప్లాన్స్..
- పార్టీ తరపున అంబేద్కర్ జయంతి వేడుకలు..
- క్షేత్ర స్థాయిలో కుల ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ కోసం ప్రణాళికలు..
- ఇచ్చిన అవకాశాల గురించి చెబుతూ ఆకట్టుకునే ప్లాన్..
- అరకు, పాడేరులో పార్టీకి 26 మంది ఎంపీటీసీలు..
- కులాల వారీగానే క్షేత్ర స్థాయి బలం పెరుగుతుందన్న లెక్కలు..
- ఎస్సీలకు దగ్గరవ్వాలన్న మెయిన్ టార్గెట్..
Off The Record: అది ఆంధ్రప్రదేశ్ అయినా…. ఉత్తరప్రదేశ్ అయినా… బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అని. అందులోనూ భేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే… బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి… బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే సరికొత్త కుల రాజకీయ సమీకరణలకు తెర లేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుని కూటమిలో సీట్ల బేరాన్ని గట్టిగా చేసే ప్లాన్ ఉందట కమలం పార్టీకి. అది జరగాలంటే… ముందు ఓట్ బ్యాంక్ని పెంచుకోవాలన్న దిశగా అడుగులేస్తోందట నాయకత్వం. ఇప్పటి వరకు తమకు దూరంగా ఉన్న వర్గాలను దరి చేర్చుకుని బలపడాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్… జయంతి వేడుకల్ని పార్టీ తరపున నిర్వహించాలని నిర్ణయించడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కుల ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ పెంచుకుంటేనే పార్టీ నిలబడుతుందన్న క్లారిటీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యులు ఆ దిశగా ఇప్పటివరకు ఇచ్చిన పదవుల గురించి ప్రచారం చేస్తూ ఆయా వర్గాలను ప్రభావితం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ బీసీయేనని, అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే కూడా బీసీలేనని, వెనుకబడిన వర్గాలకు తమ పార్టీ ఆ స్థాయి గుర్తింపు ఇస్తుందని ప్రచారం మొదలుపెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే…. అరకు, పాడేరు లాంటి చోట్ల పార్టీకి 26 మంది ఎంపీటీసీలు ఉన్నసంగతిని గుర్తు చేస్తున్నారు ఏపీ కమలనాథులు.
పొత్తు ధర్మంలో భాగంగా తమ పార్టీకి వచ్చిన అవకాశాల్లో సింహభాగం ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు పార్టీ లీడర్స్. ఇలా…. ఓట్ బ్యాంక్ పెరగాలంటే… కులాల వారీగా క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడం ఒక్కటే మార్గం అని భావిస్తోందట ఏపీ బీజేపీ నాయకత్వం. సనాతన ధర్మం, హిందూ భావజాలం పేరుతో ఇతర కులాలు తమకు దూరం కాకుండా జాగ్రత్త పడాలన్నదే మెయిన్ టార్గెట్ అని, అందులో భాగంగా ప్రధానంగా ఎస్సీలకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ జపిస్తున్న కొత్త కుల మంత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Donald Trump: మా మాట వంటే ఇరాన్ గొప్ప దేశమవుతుంది.. లేదంటే యుద్ధం తప్పదు..
-
Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
-
History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?
-
India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్ను ఆదుకున్న రష్యా!
-
Ganja: గంజాయి మాయలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!