Balasore Train Accident: బాలాసోర్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్లో గత వారం శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తికావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కేసు దర్యాప్తుపై పడింది. రైల్వే శాఖ సిఫార్సు తర్వాత ఇప్పుడు ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. నిన్ననే ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైంది.
బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్పి) స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. GRP IPC సెక్షన్లు 337, 338, 304 A, 34 కింద FIR నమోదు చేసింది. ఐపిసితో పాటు, రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 154 మరియు 175 కింద కూడా కేసు నమోదు చేయబడింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రయాణికుల ప్రాణాలకు హాని కలిగించే చట్టవిరుద్ధమైన, నిర్లక్ష్యపు చర్యల గురించి వ్యవహరిస్తుంది. సెక్షన్ 154, 175 ప్రాణాపాయానికి గురించి. అంతకుముందు, రెండు రోజుల క్రితం బాలాసోర్లో జరిగిన ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. శుక్రవారం బాలాసోర్లో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Also Read
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
Read Also:Manipur: మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. శనివారం వరకు ఇంటర్నెట్ నిషేధం
ప్రమాదానికి సంబంధించి రైలు డ్రైవర్, సిస్టమ్ లోపాన్ని రైల్వే ఖండించినప్పటికీ.. విధ్వంసం, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను సోమవారం అప్డేట్ చేస్తూ.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి పెరిగినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మృతుల సంఖ్య 275గా ఉందని ఒడిశా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 3 రైళ్ల మధ్య జరిగిన ప్రమాదంలో 278 మంది మరణించారని, 1100 మంది గాయపడ్డారని ఖుర్దా రోడ్ డివిజన్ డీఆర్ఎం రింకేశ్ రాయ్ తెలిపారు.
Read Also:Andrapradesh : రైతును కోటీశ్వరున్ని చేసిన వర్షం.. కోట్లు విలువైన వజ్రం లభ్యం..
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!