NV Subhash : ఎవరి డైరెక్షన్ లో ఎవరెలా నటిస్తున్నారో… ప్రజలు గమనిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన నువ్వా… మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో… ముందు మా అధ్యక్షుడు బండి సంజయ్, మీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి విసిరిన సవాల్ ను స్వీకరించి, కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలాయానికి వచ్చి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు రాలేదు కాబట్టి, ఎమ్మెల్యేలకు ఎర కేసు అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే… ఆయన అద్భుత దర్శకత్వంలోనే జరగిందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తప్పుడు ప్రమాణాలు చేసి, నీ మీదున్న కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే… ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని… త్వరలోనే దర్యాప్తు సంస్థల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని పైటల్ రోహిత్ రెడ్డిని హెచ్చరించారు ఎన్వీ సుభాష్.
Also Read : Top Headlines @9pm : టాప్ న్యూస్
Also Read
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
అసలు నీ స్థాయికి, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కడు చాలని, నువ్వు ఎన్ని అబద్దపు సవాళ్ళు విసిరినా… చివరికి నీ మీద ఉన్న కేసుల్లో నువ్వు జైలుకు వెళ్లక తప్పదని ఎన్వీ సుభాష్ జోష్యం చెప్పారు. ఇక నీ మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో… మీ కేసీఆర్ డైరెక్షన్ లో మీరాడిన డ్రామాలో కూడా నిజానిజాలు నిగ్గుతేలుతాయని… అందులో ఎవరి ప్రమేయం ఏంటో కూడా త్వరలోనే బయటపడుతుందని వెల్లడించారు. 2009 ఎన్నికల సందర్భంగా స్వీడన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చదివినట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న నువ్వు…. 2018 ఎన్నికల సమయంలో ఇంటర్ పాస్ అయినట్లు అఫిడవిట్ ఇచ్చావు. అంటే ముందు నువ్వు ఇంటర్ పాస్ కాకుండానే… ఎంఎస్ చదివావా..? అని ప్రశ్నించారు ఎన్వీ సుభాష్. మీ బీఆర్ఎస్ నేతల దొంగదందాలు, స్కామ్ లే కాకుండా…. దొంగ విద్యార్హతలతో ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదోవ పట్టించారని పైలట్ రోహిత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు ఎన్వీ సుభాష్. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పైలట్ రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని… అతనిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్.
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?