Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ntv Top News At 1pm 01 11 2023

Top Headlines@1PM: టాప్ న్యూస్

Published Date :November 8, 2023 , 1:00 pm
By Chandra Shekhar Pamena
Top Headlines@1PM: టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో నేడు పోలీసులు సోదాలు చేశారు. ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసులతో పాటు ఈసీ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల నకిలీ ఓట్లు వేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంత్రి అజయ్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు బోసాగ్‌ ఓట్లను చేర్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ గంగుల కమలాకర్ పై పొన్నం ప్రభాకర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నది. సరైన ఆధారాలు లేని కారణంగా పొన్నం ప్రభాకర్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

కరీంనగర్ ని నాశనం చేసిందే గంగుల కమలాకర్..
తెలంగాణ ప్రజలను అగ్రవర్ణాల పాలన నుంచి విముక్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని… అందుకే బీసీ సీఎం ప్రకటన కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చేశారు. బీసీ స్వాభిమాన్ సమావేశంలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చారని…దీంతో పేద వర్గాల్లో విశ్వాసం నింపిందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తనలాగా బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? సవాల్ విసిరారు. పేద వర్గానికి చెందిన నాయకుడిని సీఎం చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందా? ఖైదీ సంజయ్ సవాల్ విసిరారు.

ఎగిరిపోయిన పక్షులన్నీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుతున్నాయి.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ గూటి పక్షులన్ని కాంగ్రెస్ వైపు వస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెను తుపాన్ లా కాంగ్రెస్ విజృంభిస్తుందన్నారు. ఆత్మ గౌరవం కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతల మీద ఫోకస్ చేసి ఐటీ ఈడి దాడులు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పలితలను ఊహించి ఈ దాడులు చేస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజీపీ లు కలసి ఈ దాడులు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన బీజేపీకి నష్టం లేదన్నారు.

ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ – పీఏసీ భేటీ
రేపు విజయవాడలో టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందు ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ – పీఏసీ భేటీ కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ- పీఏసీ భేటీలో చర్చించనున్నారు. ఇక, రేపటి జేఏసీ సమావేశానికి టీడీపీ- పీఏసీ అజెండా ఖరారు చేయనున్నారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరుగుతున్న తీరుపై చర్చ జరుగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాలపై ప్రధానంగా టీడీపీ-పీఏసీలో చర్చించనున్నారు.

విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి.. పార్లమెంటులో ఒక ఊపు ఊపుతాను..
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారు అని వ్యాఖ్యనించారు. నేను స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం న్యాయం పోరాటం చేస్తున్నాను.. స్టీల్ ఫ్లాంట్ భూములు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకుంటున్నారు అని ఆయన ఆరోపణలు చేశారు. నా మీద కేసు పెట్టే దమ్ము ఉందా.. విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి అని కేఏ పాల్ కోరారు. నన్ను విశాఖ పట్నం ఎంపీగా గెలిపిస్తే.. పార్లమెంటును ఒక ఊపు ఊపుతాను అంటూ ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ వ్యాఖ్యనించారు. ప్రపంచానికే నేను శాంతి దూతను అని ఆయన పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమం 1000 రోజుకు చేరుకుంది. ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరానికి భారీగా స్టీల్ కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. ఇక, కార్మిక సంఘాలకు పలు పార్టీలకు చెందిన నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
దేశంలో ప్రస్తుతం కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బంగారంగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తో పాటుగా మానవ అక్రమ రవాణా కి కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ అక్రమ రవాణా పైన ఎన్ఐఏ అధికారులు ద్రుష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా తనికీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో న్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితుల ఇళ్లలో దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. కాగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, త్రిపుర, పుదుచ్చేరిలలో సోదాలు జరుపుతున్నారు . అలానే అస్సోం, బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లలో రాష్ట్రాల్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు తనికీలు చేపట్టారు.

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు.. క్షమాపణలు చెప్పిన సీఎం నితీశ్
అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్‌పై చేసిన ప్రసంగానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను మహిళా విద్య గురించి మాట్లాడాను. మేం ఈ విషయాలు సాధారణం గా చెప్పాం, ఎవరైనా గాయపడి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. నా వల్ల ఏదైనా బాధ కలిగితే నా మాటలను వెనక్కి తీసుకుంటాను. నన్ను నేను ఖండిస్తున్నాను. నేను సిగ్గుపడటమే కాకుండా బాధను కూడా వ్యక్తం చేస్తున్నాను. మేం ఏదైనా మాట్లాడి మరీ ఖండిస్తే మా మాటలను వెనక్కి తీసుకుంటామని నితీశ్ కుమార్ అన్నారు. మేము ఇప్పుడే చెప్పాము. నేను చెప్పింది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను. ఎవరైనా నన్ను విమర్శిస్తూ ఉంటే, నేను అతనిని అభినందిస్తూనే ఉంటానని అన్నారు.

ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం
ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది.. కాలుష్య నియంత్రణ అనేది ఢిల్లీ ప్రభుత్వానిదే కాదు కేంద్రం ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోవాలి అని మాజీ ఉప రాష్ట్రపతి సూచించారు. ఇది చాలా కీలక సమయం.. మాజీ ఉపరాష్ట్రపతిగా ప్రజా జీవితంలో ఉన్న, సమస్యలను పరిశీలిస్తున్నాను అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • latest news
  • national
  • telangana
  • telugu news

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • Manjummel Boys : సూపర్ హిట్ డైరెక్టర్’పై లైంగిక వేధింపుల కేసు

  • Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్

  • Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?

  • ViRosh : విరోష్.. రిసెప్షన్ కు వారికి నో ఎంట్రీ..

ట్రెండింగ్‌

  • Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions