NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు
- మైదుకూరులో నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అంటే మూడు అక్షరాలు కాదని, తెలుగువారి ఆత్మగౌరవం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. రాజకీయాలను ఎన్టీఆర్ సమూలంగా మార్చారన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. గొప్ప కథానాయకుడిగా, గొప్ప నాయకుడుగా ఎదిగారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు కడప జిల్లా మైదుకూరులో సీఎం జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహంకి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మైదుకూరులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగువారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం. బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అంటే ధైర్యం. గతంలో తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనందరినీ మద్రాసి అని పిలిచేవారు. ఢిల్లీని గడగడలాడించి తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్’ అని అన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Also Read: Top Headlines @1PM : టాప్ న్యూస్!
‘ఆరోజు ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం.. ఈరోజు దేశవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్టుగా అవతరించింది. చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సినిమాలలో ఓ గొప్ప వ్యక్తి గా ఎదిగారు. గతంలో దోపిడీకి కేంద్రంగా ఉన్న రాజకీయాలను సమూలంగా మార్చి చూపించారు. బీసీలకు మొదటిసారిగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడబిడ్డకు ఆస్తి హక్కు ఎన్టీఆర్ వల్లే సాధ్యం అయింది. మహిళ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.పేదరికం నిర్ములన ఎన్టీఆర్ కల.. ఇదే టీడీపీ పార్టీ ద్వేయం. రాయలసీమ కరువు సీమ కాదు.. రతనాల సీమ అని ఎన్టీఆర్ చేసి చూపించారు’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!