Rules Change: సిలిండర్ ధరలు పెరగడమే కాదు.. ఈ 5 నిబంధనలు కూడా నేటి నుండి మారాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rules Change: నేటి నుంచి కొత్త నెల ప్రారంభం అయింది. దీంతో అనేక నిబంధనలు మారనున్నాయి. ఇవన్నీ మీ జేబుతో కొంత సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అవి మీ నెలవారీ బడ్జెట్పై కొంత ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 పెంచింది. అదే విధంగా ఈ 5 నియమాలు కూడా మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అక్టోబర్ నుండి దేశంలో మారబోయే నియమాలలో కొత్త పన్ను నియమాలు, డెబిట్-క్రెడిట్ కార్డ్లు, పొదుపుపై వడ్డీ, విదేశీ ప్రయాణం మొదలైనవి ఉన్నాయి.
టీసీఎస్ నిబంధన మార్పు
పన్ను వసూలు (TCS) కోసం కొత్త నిబంధనలు నేటి నుండి అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనలో మార్పు కారణంగా విదేశాలకు వెళ్లే మీ ఖర్చులు ప్రభావితమవుతాయి. విదేశీ కంపెనీల షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడం ఖరీదైనది. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారిపై కూడా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం, ఆర్బిఐ సరళీకృత రెమిటెన్స్ పథకం కింద దేశంలోని ఏ వ్యక్తి అయినా ఏడాదిలో విదేశాలకు 2.5 లక్షల డాలర్ల వరకు పంపవచ్చు. నేటి నుంచి వైద్యం, విద్య మినహా ఇతర ఖర్చుల కోసం రూ.7 లక్షల కంటే ఎక్కువ డబ్బు పంపితే 20% పన్ను విధించనున్నారు.
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
Read Also:Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్టుకు నిరసనల పేరుతో నవ్వుతూ విజిల్స్, డ్యాన్స్ చేశారు..
డెబిట్-క్రెడిట్ కార్డ్ నియమాలు
తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ను ఎంచుకునే అవకాశం తమ కస్టమర్లకు ఇవ్వాలని ఆర్బిఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. వారు కొత్త కార్డ్ని తయారుచేసే సమయంలో లేదా మధ్యలో ఎప్పుడైనా మార్చుకునే సమయంలో కస్టమర్లకు ఈ ఎంపికను అందించాలి. కస్టమర్లు అలాంటి కార్డ్లను ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది వారి లావాదేవీ ఛార్జీలను తగ్గించగలదు.
ఆర్డీపై పెరిగిన వడ్డీ
5 సంవత్సరాల పోస్టాఫీసు ఆర్డీపై వడ్డీని అక్టోబర్ 1 నుంచి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు సామాన్యులకు దీనిపై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తుంది.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ
ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్ సూపర్ 400’, ‘ఇండ్ సుప్రీం 300’ అధిక వడ్డీ రేట్లతో రెండు ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించింది. ఇంతకుముందు ఈ ఎఫ్డీలు సెప్టెంబర్ 30న ముగియాల్సి ఉండగా, ఇప్పుడు వాటి ప్రయోజనాలను అక్టోబర్ 31 వరకు పొందవచ్చు.
Read Also:Minister KTR: నేడు మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన.. ఠాగూర్ స్టేడియంలో బహిరంగ సభ
తగ్గనున్న వడ్డీ రేట్లు
ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు నేటి నుండి తగ్గుతున్నాయి. 29 మే 2023న అధిక రాబడిని ఇచ్చే ప్రత్యేక ఎఫ్డీని బ్యాంక్ ప్రారంభించింది. ఇది 35 నెలల కాలంలో 7.20 శాతం రాబడిని ఇచ్చేది. ఇప్పుడు బ్యాంక్ త్వరలో దానిలో తగ్గింపును ప్రకటించనుంది.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!