Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Not Joining Congress Many Bjp Mlas Are Dissatisfied Says Pankaja Munde

Pankaja Munde: కాంగ్రెస్‌లో చేరడం లేదు.. ఆ ఛానల్‌పై పరువు నష్టం కేసు వేస్తా..

Published Date :July 7, 2023 , 5:46 pm
By Mahesh Jakki
Pankaja Munde: కాంగ్రెస్‌లో చేరడం లేదు.. ఆ ఛానల్‌పై పరువు నష్టం కేసు వేస్తా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pankaja Munde: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే ఖండించారు. రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. దీని గురించి అడగ్గా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, తమ పార్టీలో చాలా మంది చాలా కాలంగా ఎన్‌సీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, దానితో బీజేపీ పొత్తును వారు వెంటనే అంగీకరించరని అన్నారు. బీజేపీ నాయకత్వం పంకజా ముండేతో మాట్లాడుతుందని, ఆమె పార్టీ కోసం పని చేస్తూనే ఉంటారని తాను నమ్ముతున్నానని ఫడ్నవీస్ అన్నారు.

Also Read: Kevin Spacey: థియేటర్‌లో అభిమానిది ‘అది’ పట్టుకున్న హీరో.. అచ్చం కోబ్రాలాగే ఉందంటూ..

Also Read

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన 'ర్యాన్‌ రికెల్టన్‌'.. SRH ముందు భారీ టార్గెట్.!
  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
  • Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..

కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజా ముండే ఈరోజు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. తాను కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశానని ప్రసారం చేసిన ఛానల్‌పై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీకి చెందిన తన బంధువు ధనంజయ్ ముండే చేతిలో ఓడిపోయి, 2020లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన పంకజా ముండే, పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తరచుగా వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి చర్చలు ఎందుకు జరుగుతున్నాయి.. పార్టీ కార్యక్రమాలకు నన్ను చాలాసార్లు ఆహ్వానించకపోవడమే కారణమా.. తనను విస్మరించారని ఎందుకు పార్టీ సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. “20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశాను, అయినా నా నీతిని ప్రశ్నిస్తున్నారు, పుకార్లు పుట్టిస్తున్నారు. సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఎప్పుడూ కలవలేదని ప్రమాణం చేస్తున్నాను.. మరే పార్టీలో చేరడం లేదు.. ఏమైనా చేస్తాను. నేను బహిరంగంగా చేయాలనుకుంటున్నాను, బీజేపీ సిద్ధాంతం నా రక్తంలో ఉంది. నేను అటల్ బిహారీ వాజ్‌పేయి, గోపీనాథ్ ముండే చూపిన మార్గంలో నడుస్తున్నాను, ”అని ఆమె పేర్కొన్నారు.

Also Read: Chhattisgarh: రూ.7,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఈ రోజుల్లో కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయని పంకజా ముండే అన్నారు. “బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, కానీ వారు భయపడి బయటకు మాట్లాడలేకపోతున్నారు. నరేంద్ర మోదీ ‘నా ఖౌంగా నా ఖానే దుంగా’ (నేను అవినీతిని సహించను) అని అన్నారు. ప్రజలు ఆ నినాదాన్ని ఇష్టపడ్డారు.” అని ఆమె చెప్పారు.

అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఈ వారం మహారాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేసిన ధనంజయ్ ముండే ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు తాను అభినందించానని బీజేపీ నాయకురాలు చెప్పారు. తాను పార్టీ నిర్ణయాలను ఎప్పుడూ అంగీకరిస్తానని, ఎవరినీ వెన్నుపోటు పొడిచలేదని ముండే అన్నారు. “నేను 2019లో ఓడిపోయినప్పటి నుండి, ఎమ్మెల్సీ ఎన్నికలు లేదా రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ, నేను అసంతృప్తిగా ఉన్నానని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాకు ఒక ఫారం ఇచ్చారు. నా నామినేషన్ సమర్పించడానికి నిమిషాల ముందు నేను అలా చేయలేను అని చెప్పాను. నేను పార్టీ నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరించాను.ఎవరిపైనా వ్యక్తిగత దాడులు చేయలేదు, వెన్నుపోటు పొడిచలేదు” అని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయంలో రాజీపడవలసి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ఎప్పటికీ వెనుకాడనని ముందే చెప్పానని పంకజా ముండే తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Devendra Fadnavis
  • Maharashtra
  • Maharashtra Politics

తాజావార్తలు

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..

  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions