North Korea: ఆ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా అమెరికాకు సవాల్ విసిరింది. ఉత్తర కొరియా వారం వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ సమాచారాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ సుదూర క్షిపణిని ప్యోంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం నుండి ప్రయోగించబడింది. నాలుగు రోజుల క్రితం కిమ్ జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను పరీక్షించారు.
యోన్హాప్ వార్తా సంస్థ ప్రకారం, తీవ్రమైన ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఉత్తర కొరియా గురువారం బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. కొరియా ద్వీపకల్పంలోని తూర్పు తీరంలో జలాల్లోకి క్షిపణి పరీక్షను ప్రయోగించినట్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పినట్లు ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికా, దక్షిణ కొరియాలు తమ సహకారాన్ని పెంచుకున్నాయి. ఇరు దేశాలు పలుమార్లు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో గత నెలరోజులుగా మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా ఒకదాని తర్వాత ఒకటి క్షిపణులను పరీక్షిస్తూనే ఉంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగం.. దక్షిణ కొరియా, జపాన్ నాయకులు టోక్యోలో కలుసుకోవడానికి కొన్ని గంటల ముందు జరిగింది. ఈ సమావేశంలో ఉత్తర కొరియా అణు కార్యక్రమాల గురించి చర్చించినట్లు సమాచారం.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
Read Also: Eric Garcetti: భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి
మంగళవారం, ఉత్తర కొరియా రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అమెరికా-దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు ప్రారంభించిన తర్వాత ప్రయోగించింది, ఇది ఐదేళ్లలో అతిపెద్దదని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆదివారం అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలకు స్పష్టమైన నిరసనగా జలాంతర్గామి నుంచి రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను పేల్చింది. అమెరికా-దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా ఫ్రీడమ్ షీల్డ్తో సోమవారం ప్రారంభించిన ఈ సైనిక విన్యాసాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలు ఉత్తర కొరియా రెట్టింపు దూకుడు కారణంగా “మారుతున్న భద్రతా వాతావరణం”పై దృష్టి సారించాయని మిత్రరాజ్యాలు తెలిపాయి.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!