North Korea: ఆ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా అమెరికాకు సవాల్ విసిరింది. ఉత్తర కొరియా వారం వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ సమాచారాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ సుదూర క్షిపణిని ప్యోంగ్యాంగ్లోని సునాన్ ప్రాంతం నుండి ప్రయోగించబడింది. నాలుగు రోజుల క్రితం కిమ్ జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను పరీక్షించారు.
యోన్హాప్ వార్తా సంస్థ ప్రకారం, తీవ్రమైన ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఉత్తర కొరియా గురువారం బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. కొరియా ద్వీపకల్పంలోని తూర్పు తీరంలో జలాల్లోకి క్షిపణి పరీక్షను ప్రయోగించినట్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పినట్లు ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికా, దక్షిణ కొరియాలు తమ సహకారాన్ని పెంచుకున్నాయి. ఇరు దేశాలు పలుమార్లు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో గత నెలరోజులుగా మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా ఒకదాని తర్వాత ఒకటి క్షిపణులను పరీక్షిస్తూనే ఉంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగం.. దక్షిణ కొరియా, జపాన్ నాయకులు టోక్యోలో కలుసుకోవడానికి కొన్ని గంటల ముందు జరిగింది. ఈ సమావేశంలో ఉత్తర కొరియా అణు కార్యక్రమాల గురించి చర్చించినట్లు సమాచారం.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Read Also: Eric Garcetti: భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి
మంగళవారం, ఉత్తర కొరియా రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అమెరికా-దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు ప్రారంభించిన తర్వాత ప్రయోగించింది, ఇది ఐదేళ్లలో అతిపెద్దదని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆదివారం అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలకు స్పష్టమైన నిరసనగా జలాంతర్గామి నుంచి రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను పేల్చింది. అమెరికా-దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా ఫ్రీడమ్ షీల్డ్తో సోమవారం ప్రారంభించిన ఈ సైనిక విన్యాసాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలు ఉత్తర కొరియా రెట్టింపు దూకుడు కారణంగా “మారుతున్న భద్రతా వాతావరణం”పై దృష్టి సారించాయని మిత్రరాజ్యాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!