Heatwave: దేశంలోని పలు ప్రాంతాల్లో 48.8 డిగ్రీల ఎండలు.. ‘రెడ్’ వార్నింగ్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్లోని బార్మర్లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
ADR Report: లోక్సభ అభ్యర్థులపై సంచలన రిపోర్ట్! ఎంతమంది నిరక్షరాస్యులున్నారంటే..!
Also Read
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
రాజస్థాన్లోని చురులో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్, ఫలోడిలో 47.8 డిగ్రీలు, జైసల్మేర్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని గుణాలో 46.6 డిగ్రీలు, గుజరాత్లోని అహ్మదాబాద్లో 45.9 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్లోని ఒరాయ్లో 45 డిగ్రీలు, పంజాబ్లోని భటిండా మరియు హర్యానాలోని సిర్సాలో 45.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత గురువారం స్వల్పంగా తగ్గింది.
Sruthi: బాయ్ ఫ్రెండుతో బ్రేకప్.. మింగిల్ అయ్యేందుకు రెడీ అంటూ శ్రుతి షాకింగ్ వీడియో
రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్లకు వాతావరణ శాఖ ‘రెడ్’ హెచ్చరికను జారీ చేసింది. ఈ ఎండల వేడి వల్ల అనారోగ్యం, హీట్స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ మరియు రాజస్థాన్లలో రాబోయే మూడు రోజులలో రాత్రిళ్లు కూడా వేడిగా ఉంటాయని పేర్కొంది. ఇదిలా ఉంటే.. బయట పనిచేసేవారు, వృద్ధులు, పిల్లలు వేడి అలసట మరియు హీట్స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 1998-2017 మధ్య 1,66,000 మందికి పైగా ప్రజలు వేడి తరంగాల ఫలితంగా మరణించారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!