ADR Report: లోక్సభ అభ్యర్థులపై సంచలన రిపోర్ట్! ఎంతమంది నిరక్షరాస్యులున్నారంటే..!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఆరో విడత శనివారం జరగనుంది. చివరిగా జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఏడీఆర్ కీలక రిపోర్ట్ బయటపెట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Off The Record : రాజమండ్రిలో ఆ అభ్యర్థి గెలిస్తే పార్టీ ఓడిపోవడం ఆనవాయితీ..?
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకే చదువుకున్నట్లు తెలిపింది. 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది అభ్యర్థులు తాము 12వ తరగతి ఉత్తీర్ణులయ్యామని, 1,502 మంది అభ్యర్థులు తాము గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించుకున్నారు.
ఇది కూడా చదవండి: Devineni Uma: డీజీపీకి లేఖ రాసిన దేవినేని ఉమా.. అందులో ఏముందంటే?
ఇక డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. మొదటి దశ ఎన్నికలలో 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5, 12వ తరగతులని చెప్పగా.. 836 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. 26 మంది నిరక్షరాస్యులని చెప్పారు. నలుగురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. రెండో దశలో 533 మంది అభ్యర్థులు తమ విద్యా అర్హతలు 5, 12వ తరగతుల మధ్య ఉన్నాయని ప్రకటించగా, 574 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదివామని వెల్లడించారు. దాదాపు 37 మంది అక్షరాస్యులమని, ఎనిమిది మంది నిరక్షరాస్యులని చెప్పగా ముగ్గురు తమ విద్యార్హతలను అందించలేదు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: పెళ్లి ఇంట్లో మహిళలు డ్యాన్స్ చేస్తుండగా రెచ్చిపోయిన పోకిరీలు..
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!