Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఉదంతం..
- అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఉదంతం.
- నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లో.
- కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవను కోసేసారన్న ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఓ ఉదంతం వెలుగు చూసింది. నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవ (మతపరమైన చేతి దారం) ను కోసేసారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విషయం తెలియగానే హిందువులు దీనిపై నిరసనకు దిగారు. అయితే., ఫ్యాక్టరీ భద్రతా అధికారి ఒక ప్రకటన విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.
Sanjay Kalvakuntla: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
సెప్టెంబరు 21న ఈ సంఘ్తన జరిగింది. ఆ రోజు, ఉద్యోగులు ఫ్యాక్టరీ లోపలికి వెళుతున్నప్పుడు గేటు వద్ద ఉన్న గార్డు అందరి కాలవని కత్తిరించి లోపలికి వెళ్ళమని అడిగాడు. దీనిపై పలువురు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా రూపొందించి వైరల్గా మార్చారు. వివాదం ముదిరిపోవడంతో కంపెనీ సెక్యూరిటీ అధికారి సచ్చిదానంద్ తివారీ తప్పును అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కంపెనీ పాలసీ ప్రకారం.. బ్యాంగిల్స్, ఉంగరాలు, బ్రాస్లెట్లు, రిస్ట్ వాచీలు ధరించడం ప్రక్రియ ప్రాంతంలో అనుమతించబడదని చెప్పారు. ఎందుకంటే., ఈ వస్తువులు ప్రక్రియ ప్రాంతంలోకి వస్తాయి. అలా వచ్చినవి తయారు చేసే పానీయాన్ని కలుషితం చేస్తాయి. ఈ ఘటన జరిగిన రోజు కూడా సెక్యూరిటీ గార్డుకు ఈ సూచన రాగా.. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కాలవను కోసేందుకు ప్రయత్నించాడని తెలిపారు.
Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్ రష్మి విజ్ఞప్తి!
ఈ ఘటనపై రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పెద్ద ప్రకటన చేస్తూ.. ఇలాంటి అవమానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. ఇది హిందూ సమాజాన్ని అవమానించడమే. కఠిన చర్యలు తీసుకోవాలని సాధు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని అయ్యన అన్నారు.
Hindus are being insulted by the Coca-Cola company in Ayodhya.
They are being allowed to enter after cutting off the Hindu symbol Kalawa from their hands.
This is happening in India.
Will Hindus boycott this?
pic.twitter.com/GQPdFnj0f5— Mr Hindu (You) (@MrHinduYou) September 24, 2024
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!