AAP: జైల్లో కేజ్రీవాల్ను వేధిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కేంద్ర ప్రభుత్వం హింస్తోందని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. జైల్లో కేజ్రీవాల్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించేందుకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Nagpur: 2019 అత్యాచారం, హత్య ఘటన.. నిందితుడికి మరణశిక్ష
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్కు 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1తో గడువు ముగియడంతో జూన్ 2 (ఆదివారం) తీహార్ జైల్లో లొంగిపోయారు. తాజాగా మంత్రి అతిశీ ఈ ఆరోపణలు చేయడం కలకలం రేపుతున్నాయి. మంగళవారమే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆరోపణలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: CM Jagan: కౌంటింగ్ ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ సూచన
జైల్లో కేజ్రీవాల్ హింసకు గురవుతున్నారని మంత్రి తెలిపారు. ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు జైలు సిబ్బందితో కలిసి మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయని.. కానీ కేజ్రీవాల్ ఉన్న సెల్లో కనీసం కూలర్ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఆయన ఆరోగ్యంతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మంత్రి ధ్వజమెత్తారు. తమ నాయకుడి పట్ల ఇలా ప్రవర్తించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించలేరని అతీశీ పేర్కొన్నారు. బీజేపీ చర్యలను ఎన్నటికీ మరచిపోలేరని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైల్లో పెట్టారు. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉందని బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ గడువు జూన్ 1తో ముగిసింది. దీంతో ఆయన ఆదివారం (జూన్ 2) తీహార్ జైల్లో లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. లక్షద్వీప్ వెళ్లొచ్చంటూ పోస్టు
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!