CM Jagan: కౌంటింగ్ ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. రాబోవు అయిదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం తేలనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. మే13న పోలింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అక్కడ భారీ స్థాయిలో పోలీసులు సిబ్బందిని, కేంద్ర బలగాలను మోహరించారు.
READ MORE: Varla Ramaiah: రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉంది.. ఈసీకి వర్ల రామయ్య లేఖ
Also Read
- Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
కౌంటింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. ” ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.” అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అందరి కళ్లు ఉన్నాయి. మళ్లీ వైఎస్సార్సీపీ గెలుస్తుందా.. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తోందా అనే చర్చ జరుగుతోంది. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధింంచి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జూన్ 4న కౌంటింగ్లో భాగంగా.. ముందుగా సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఈటీబీపీఎస్ (ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
-
INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!