Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magunta Sreenivasulu Reddy: ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మాగుంట పోటీపై స్పష్టత ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం చెబుతోంది. మంగళవారం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయినా మాగుంట పోటీపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా కొలిక్కిరాలేదు. సీఎం జగన్ను కలిసేందుకు వచ్చి గత మూడు రోజులుగా బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో గత మూడు రోజులుగా మాజీమంత్రి బాలినేనితో జిల్లా లోని పలు నియోజవర్గాల వైసీపీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న
Also Read
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
మూడు రోజులుగా సీఎం జగన్ను కలిసేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు గత కొన్ని నెలలుగా నగదు వేయాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరుతున్నారు. పలుసార్లు ఇదే విషయమై సీఎం జగన్ సహా ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని బాలినేని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. భూములకు నగదు విషయంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు. పలు విషయాల్లో స్పష్టత వచ్చాకే సీఎం జగన్తో కలుస్తానని విజయసాయిరెడ్డికి బాలినేని చెప్పారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సీఎం జగన్ను కలవకుండానే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.
తాజావార్తలు
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!