Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magunta Sreenivasulu Reddy: ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మాగుంట పోటీపై స్పష్టత ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం చెబుతోంది. మంగళవారం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయినా మాగుంట పోటీపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా కొలిక్కిరాలేదు. సీఎం జగన్ను కలిసేందుకు వచ్చి గత మూడు రోజులుగా బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో గత మూడు రోజులుగా మాజీమంత్రి బాలినేనితో జిల్లా లోని పలు నియోజవర్గాల వైసీపీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
మూడు రోజులుగా సీఎం జగన్ను కలిసేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు గత కొన్ని నెలలుగా నగదు వేయాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరుతున్నారు. పలుసార్లు ఇదే విషయమై సీఎం జగన్ సహా ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని బాలినేని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. భూములకు నగదు విషయంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు. పలు విషయాల్లో స్పష్టత వచ్చాకే సీఎం జగన్తో కలుస్తానని విజయసాయిరెడ్డికి బాలినేని చెప్పారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సీఎం జగన్ను కలవకుండానే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!