Crop Holiday: క్రాప్ హాలీడేపై కనిపించని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమలో క్రాప్ హాలీడేపై అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇచ్చి అమలు చేయకపోతే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు చెబుతున్నారు. దాంతో కోనసీమలో సాగుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో దాదాపు 12 మండలాల్లో రైతులు ఈ ఏడాది సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా డ్రైన్లు సమస్యతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో వర్షాలు ఎక్కువగా పడతాయి వర్షపు నీరు మొత్తం పొలాల్లో నిలవడంతో అన్నదాతలకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి.
డ్రెయిన్ల పూడిక సంబంధించి గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అప్పుడు కూడా అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప అది అమలుకు నోచుకోలేదు ఇప్పుడు కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నారు కానీ రైతులకు నమ్మకం కుదరడం లేదు. క్షేత్రస్థాయిలో డ్రైన్లు సమస్యను ఉన్నతాధికారులు పరిశీలించాలని రైతులు వేడుకుంటున్నారు. తూతూమంత్రంగా పనులు చేయడం వల్ల ఉపయోగం ఉండదని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు పంటకి వేలల్లో పెట్టుబడి పెట్టడం వలన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నారు.
Also Read
- AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. బిజినెస్ రూల్స్ మార్పులకు సీఎం ఆదేశాలు
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
గత సీజన్లో కూడా రైతులకు అధికారుల నుంచి ఇటువంటి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్య వచ్చినా తాము పరిష్కారం చేస్తామని రైతులు నిర్భయంగా పంట వేసుకోండి అని ప్రచారం చేశారు. కానీ తీరా రైతులు పంట వేశాక అధికారులు అడ్రస్ లేకుండా పోయారు. కొంత మంది అన్నదాతలు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా వచ్చిన పరిస్థితి లేకుండా పోయింది. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయింది.
ఈసారి 12 మండలాల్లో రైతులు ఏకతాటిపై వచ్చారు. పూర్తిస్థాయిలో డ్రైన్లను ఆధునీకరించి వర్షపు నీరు వెళ్ళేలా ఉంటేనే తాము సాగుకు సిద్ధం అవుతారని చెబుతున్నారు.. ఆ సమస్య పరిష్కారం దిశగా పనులు మొదలు పెడితే తాము ముందుకు రాగలమని అని అంటున్నారు. తమ కష్టం పెట్టుబడి వృధాగా పోతుంటే ఇక వ్యవసాయం చేసి ఉపయోగమేముంది అనేది రైతుల వాదన. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పనులు ప్రారంభించాలి. రైతులు సాగు చేయకపోవడం వల్ల కూలీలు కూడా పని దొరికే అవకాశం లేదు. పంట డబ్బులు త్వరగా ఇవ్వడం, రైతులుకి పనులు ఉన్న టైం లో ఉపాధి పనులు లేకుండా చేయాలని చెబుతున్నారు. మొత్తానికి అన్నదాతలు క్రాప్ హాలీ డే పై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇస్తున్నారు. పనులు ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతుంది.. మరి సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపుతారో చూడాలి.
తాజావార్తలు
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
-
CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
-
US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
-
Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకున్న టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?