IPL 2025: అవి వద్దంటూ.. బీసీసీఐకి సునీల్ గవాస్కర్ విన్నపం!
- అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025
- మే 17 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం
- బీసీసీఐకి సునీల్ గవాస్కర్ విన్నపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ను తిరిగి ఆరంబించేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఐపీఎల్ మ్యాచ్లు మే 17 నుంచి ఆరంభం కానున్నాయి. మే 17న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, కోల్కతా మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ఓ విన్నపం చేశారు.
ఐపీఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్లను చీర్ లీడర్స్, డీజేలు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐకి సునీల్ గవాస్కర్ సూచించారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సన్నీ విన్నపంను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్కు గుడ్ న్యూస్.. రూ.2130 తగ్గిన బంగారం ధర!
ఐపీఎల్ 2025లో 17 మ్యాచ్లు మిగిలున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన మ్యాచ్ మరలా జరగనుంది. మే 24న ధర్మశాలలో కాకుండా.. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. లీగ్ మ్యాచ్లు మే 27న ముగియనుండగా.. ప్లేఆఫ్స్ మే 29న ప్రారంభం కానున్నాయి. ఇక ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. ఢిల్లీ, జైపుర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!