Delhi: ఢిల్లీ రోడ్లపై బైక్-టాక్సీలు నడపకూడదు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No bike-taxis to ply on Delhi roads: దేశ రాజధానిలో బైక్-టాక్సీలను నడపడానికి అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై భారత సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. బైక్-టాక్సీ అగ్రిగేటర్లు, రాపిడో, ఉబర్లు జాతీయ రాజధానిలో పనిచేయడానికి అనుమతించే హైకోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తుది విధానాన్ని రూపొందించే వరకు ఢిల్లీ రోడ్లపై బైక్-టాక్సీలు నడపరాదని తీర్పును ప్రకటిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే, ఈ అంశాన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్లతో కూడిన వెకేషన్ బెంచ్, ఢిల్లీ హైకోర్టు ద్వారా తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించమని అభ్యర్థించడానికి ఇద్దరు అగ్రిగేటర్లకు స్వేచ్ఛను మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయంలో తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్-టాక్సీ అగ్రిగేటర్పై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మనీష్ వశిష్ట్ వాదిస్తూ, తుది విధానాన్ని ప్రకటించే వరకు ప్రభుత్వ నోటీసుపై స్టే విధించాలన్న హైకోర్టు నిర్ణయం రాపిడో రిట్ పిటిషన్ను వాస్తవంగా అనుమతించినట్లేనని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో, బైక్-టాక్సీలను ఢిల్లీలో నడపకుండా హెచ్చరించింది. ఉల్లంఘనలకు అగ్రిగేటర్లకు రూ. 1 లక్ష వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Also Read: Money Saving Tips: డబ్బును పొదుపు చెయ్యాలనుకుంటున్నారా?.. ఇది మీకోసమే..
ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్ షేరింగ్ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్ షేరింగ్ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్ షేరింగ్ టూ వీలర్ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్ షేరింగ్ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..