Nitish Kumar Reddy: రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి
- బంగ్లాపై టీమిండియా విక్టరీ..
- మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం.
- రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత నితీష్ రెడ్డి, రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరుకు పునాది వేశారు. రింకూ సింగ్, నితీష్ మధ్య నాలుగో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డి తన మొదటి టి20 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
Also Read
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
నితీష్ రెడ్డి (Nitish Kumar Reddy) వేగంగా ఆడి 34 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్లో తన మ్యాజిక్ను చాటిన నితీశ్ కుమార్ బౌలింగ్లోనూ అద్భుతాలు చేశాడు. నితీష్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. నితీష్ రెడ్డి ఈ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఒకే టీ20 మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
అద్భుతమైన ఆటతీరుతో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (Player of the match) కూడా లభించింది. ఈ టైటిల్ను గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీశ్ నిలిచాడు. నితీష్ 21 ఏళ్ల 136 రోజుల వయసులో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ( Rohith sharma) అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 20 ఏళ్ల 143 రోజుల్లో తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ను అందుకున్నాడు.
తాజావార్తలు
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!