Nitish Kumar Reddy: రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి
- బంగ్లాపై టీమిండియా విక్టరీ..
- మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం.
- రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత నితీష్ రెడ్డి, రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరుకు పునాది వేశారు. రింకూ సింగ్, నితీష్ మధ్య నాలుగో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డి తన మొదటి టి20 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
నితీష్ రెడ్డి (Nitish Kumar Reddy) వేగంగా ఆడి 34 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్లో తన మ్యాజిక్ను చాటిన నితీశ్ కుమార్ బౌలింగ్లోనూ అద్భుతాలు చేశాడు. నితీష్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. నితీష్ రెడ్డి ఈ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఒకే టీ20 మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
అద్భుతమైన ఆటతీరుతో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (Player of the match) కూడా లభించింది. ఈ టైటిల్ను గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీశ్ నిలిచాడు. నితీష్ 21 ఏళ్ల 136 రోజుల వయసులో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ( Rohith sharma) అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 20 ఏళ్ల 143 రోజుల్లో తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ను అందుకున్నాడు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!