Nitish Kumar Reddy: రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి
- బంగ్లాపై టీమిండియా విక్టరీ..
- మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం.
- రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత నితీష్ రెడ్డి, రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరుకు పునాది వేశారు. రింకూ సింగ్, నితీష్ మధ్య నాలుగో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డి తన మొదటి టి20 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
నితీష్ రెడ్డి (Nitish Kumar Reddy) వేగంగా ఆడి 34 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్లో తన మ్యాజిక్ను చాటిన నితీశ్ కుమార్ బౌలింగ్లోనూ అద్భుతాలు చేశాడు. నితీష్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. నితీష్ రెడ్డి ఈ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఒకే టీ20 మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
అద్భుతమైన ఆటతీరుతో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (Player of the match) కూడా లభించింది. ఈ టైటిల్ను గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీశ్ నిలిచాడు. నితీష్ 21 ఏళ్ల 136 రోజుల వయసులో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ( Rohith sharma) అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 20 ఏళ్ల 143 రోజుల్లో తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ను అందుకున్నాడు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!