Nitish Kumar Reddy: రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి
- బంగ్లాపై టీమిండియా విక్టరీ..
- మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం.
- రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత నితీష్ రెడ్డి, రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరుకు పునాది వేశారు. రింకూ సింగ్, నితీష్ మధ్య నాలుగో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డి తన మొదటి టి20 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
నితీష్ రెడ్డి (Nitish Kumar Reddy) వేగంగా ఆడి 34 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్లో తన మ్యాజిక్ను చాటిన నితీశ్ కుమార్ బౌలింగ్లోనూ అద్భుతాలు చేశాడు. నితీష్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. నితీష్ రెడ్డి ఈ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఒకే టీ20 మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
అద్భుతమైన ఆటతీరుతో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (Player of the match) కూడా లభించింది. ఈ టైటిల్ను గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీశ్ నిలిచాడు. నితీష్ 21 ఏళ్ల 136 రోజుల వయసులో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ( Rohith sharma) అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 20 ఏళ్ల 143 రోజుల్లో తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ను అందుకున్నాడు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!