Nitin Gadkari: E20 వద్దనుకునేవారు ఎక్కువ చెల్లించి 100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 పెట్రోల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలనుకునే వారు, ఎక్కువ ధర చెల్లించి దానిని కొనుగోలు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత వేరే ప్రత్యామ్నాయాలు సాధ్యం కాదని, అయితే ఇథనాల్ లేని పెట్రోల్ కోరుకునే వారి కోసం ప్రీమియం ధరలో అది లభిస్తుందని చెప్పారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు పాడవుతాయనే వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల వాహనదారుల్లో ఉన్న ఆందోళనలను తొలగించడానికి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. ఇంధన నాణ్యతపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా బంకుల్లో లేదా కస్టమర్ కేర్లో నమోదు చేయాలని, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని చమురు సంస్థలు కోరాయి.
Also Read
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
మరోవైపు.. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కూడా E20 ఇంధనంపై కీలక విషయాలను వెల్లడించారు. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని, తుప్పు పట్టడం లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఐఐటీ కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుడు ధృవ రాజ్ కర్ణా స్పష్టం చేశారు. విస్తృత పరిశోధనల తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.
అలాగే.. చాలా మంది భయపడుతున్నట్లుగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీలో ఎలాంటి పెద్ద మార్పులు లేదా తగ్గుదల కనిపించలేదని పేర్కొన్నారు. నిజానికి మైలేజీ అనేది ఇంధనం కంటే కూడా వాహనం నడిపే విధానం, రోడ్ల పరిస్థితి, వాహనం యొక్క సకాలంలో మెయింటెనెన్స్ (రహదారి రక్షణ)పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు జరిపిన అన్ని పరీక్షల్లో ఇంజన్ మన్నికపై గానీ, వాహన వేగంపై గానీ E20 ఇంధనం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని పరిశోధకులు తేల్చి చెప్పారు. కాబట్టి వాహనదారులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు ఎక్కువ చెల్లించి 100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!