Nithari Killings Accused: నిఠారీ వరుస హత్యల నిందితుడు జైలు నుంచి విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithari Killings Accused: నిఠారీ వరుస హత్యల నిందితుడు మోనీందర్ సింగ్ పంధర్ను అలహాబాద్ హైకోర్టు అన్ని అభియోగాల నుంచి తొలగించిన కొద్ది రోజుల తర్వాత గ్రేటర్ నోయిడా జైలు నుంచి ఈరోజు విడుదలయ్యాడు. అలహాబాద్ హైకోర్టు సోమవారం రెండు కేసుల్లో మోనీందర్ సింగ్ పంధర్, సంచలనాత్మక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతని ఇంటి పనివాడు సురేంద్ర కోలీని 12 కేసుల్లో నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన సురీందర్ కోలీ, మోనీందర్ సింగ్ పంధర్లను సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తన వాదనను సహేతుకమైన సందేహాలకు అతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది.
Also Read: Karnataka: ఇంట్లో గొడవలు.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అయితే కోలీ ఒక కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదీగా కొనసాగుతున్నాడు. 2005, 2006 మధ్య ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని నిఠారీ ప్రాంతంలోని మోనీందర్ సింగ్ పంధర్ ఇంటిలో వరుస హత్యలు జరిగాయని సీబీఐ తెలిపింది. 2006లో డిసెంబర్లో వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధర్ ఇంటి దగ్గరలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వరుస హత్యల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాత పరిణామాల్లో మోనీందర్ సింగ్, అతని ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తు తెలిసింది.
Also Read: Hyderabad: హైదరాబాద్లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు..
సురిందర్ కోలీ.. మోనీందర్ సింహ్ పంధర్ ఇంటిలో సహాయకుడిగా పనిచేశాడు. ఈ విషయాలు వెల్లడైన తర్వాత చాలా మంది ఆ ఇంటిని “హర్రర్స్ ఇల్లు” అని పిలిచారు. కోలీ పిల్లలను ఇంట్లోకి రప్పించేవాడు, అక్కడ సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధర్ వారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు చిన్నారుల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడేశారని పోలీసులు తెలిపారు. పంధర్ ఇంటికి సమీపంలోని కాలువలో తప్పిపోయిన పిల్లల శరీర భాగాలను దొరకడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది. ఇది మరింత మంది బాధితుల గుర్తింపును వెల్లడించింది. హత్య, వికృతీకరణ, నరమాంస భక్షకానికి సంబంధించిన ఆందోళనకరమైన వార్తలు వారాలు, నెలలపాటు దేశంలో కలకలం సృష్టించాయి. అనేక మంది చిన్నారులపై వరుస హత్యలు జరిగాయని, ఆ తర్వాత కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కోలీ గతంలో కూడా చనిపోయిన బాధితులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు మరియు వారి శరీర భాగాలను కూడా తిన్నట్లు అంగీకరించాడు. 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వీరిద్దరూ కూడా దోషులుగా నిర్ధారించబడ్డారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!