Nithari Killings Accused: నిఠారీ వరుస హత్యల నిందితుడు జైలు నుంచి విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithari Killings Accused: నిఠారీ వరుస హత్యల నిందితుడు మోనీందర్ సింగ్ పంధర్ను అలహాబాద్ హైకోర్టు అన్ని అభియోగాల నుంచి తొలగించిన కొద్ది రోజుల తర్వాత గ్రేటర్ నోయిడా జైలు నుంచి ఈరోజు విడుదలయ్యాడు. అలహాబాద్ హైకోర్టు సోమవారం రెండు కేసుల్లో మోనీందర్ సింగ్ పంధర్, సంచలనాత్మక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతని ఇంటి పనివాడు సురేంద్ర కోలీని 12 కేసుల్లో నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన సురీందర్ కోలీ, మోనీందర్ సింగ్ పంధర్లను సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తన వాదనను సహేతుకమైన సందేహాలకు అతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది.
Also Read: Karnataka: ఇంట్లో గొడవలు.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
అయితే కోలీ ఒక కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదీగా కొనసాగుతున్నాడు. 2005, 2006 మధ్య ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని నిఠారీ ప్రాంతంలోని మోనీందర్ సింగ్ పంధర్ ఇంటిలో వరుస హత్యలు జరిగాయని సీబీఐ తెలిపింది. 2006లో డిసెంబర్లో వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధర్ ఇంటి దగ్గరలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వరుస హత్యల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాత పరిణామాల్లో మోనీందర్ సింగ్, అతని ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తు తెలిసింది.
Also Read: Hyderabad: హైదరాబాద్లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు..
సురిందర్ కోలీ.. మోనీందర్ సింహ్ పంధర్ ఇంటిలో సహాయకుడిగా పనిచేశాడు. ఈ విషయాలు వెల్లడైన తర్వాత చాలా మంది ఆ ఇంటిని “హర్రర్స్ ఇల్లు” అని పిలిచారు. కోలీ పిల్లలను ఇంట్లోకి రప్పించేవాడు, అక్కడ సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధర్ వారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు చిన్నారుల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడేశారని పోలీసులు తెలిపారు. పంధర్ ఇంటికి సమీపంలోని కాలువలో తప్పిపోయిన పిల్లల శరీర భాగాలను దొరకడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది. ఇది మరింత మంది బాధితుల గుర్తింపును వెల్లడించింది. హత్య, వికృతీకరణ, నరమాంస భక్షకానికి సంబంధించిన ఆందోళనకరమైన వార్తలు వారాలు, నెలలపాటు దేశంలో కలకలం సృష్టించాయి. అనేక మంది చిన్నారులపై వరుస హత్యలు జరిగాయని, ఆ తర్వాత కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కోలీ గతంలో కూడా చనిపోయిన బాధితులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు మరియు వారి శరీర భాగాలను కూడా తిన్నట్లు అంగీకరించాడు. 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వీరిద్దరూ కూడా దోషులుగా నిర్ధారించబడ్డారు.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!