BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. విదేశీ నేతల్ని కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం అంటూ గురువారం రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఇందిరాగాంధీ వీడియోతో సమాధానం ఇచ్చారు. ఇందిరా గాంధీ, క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రో, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్లను కౌగిలించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే కాకుండా, 8 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాని నరేంద్రమోడీని ఆలింగనం చేసుకున్న ఫోటోను కూడా దూబే పోస్ట్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీ, మీరు ఎప్పుడు పరిణతి చెందుతారు?’’ అని ప్రశ్నించారు. ప్రధానిని అవమానించడం ద్వారా వరసగా మూడు సార్లు మోడీని ఎన్నుకున్న కోట్లాది మంది ఓటర్లను అవమానించారని జోషి అన్నారు. వంశపారంపర్య రాజకీయాలను ప్రజలు తిరస్కరించిన ప్రజల తీర్పును ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Also Read
- Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
గురువారం ఢిల్లీలో క్రియేటివ్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం అంటే ప్రపంచ దేశాల నేతలను ఆలింగనం చేసుకోవడమే అన్న ఆలోచన ప్రధాని మోదీకి ఎక్కడి నుంచి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. వ్యంగ్యంగా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను కౌగిలించుకున్నారు. సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘మెలోని అనుకుని కౌగిలించుకోలేదుగా..?’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ గాంధీ నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అని సమాధానం ఇచ్చారు.
అయితే, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రస్తావించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత చేయాల్సిన కామెంట్స్ కావని అన్నారు. ఆయన ఉపయోగించని భాష అసభ్యకరమైంది, అశ్లీలమైంది, అనుచితమైందిగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ఎగతాళి చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణతిలో లోపాన్ని చూపిస్తున్నాయని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ విమర్శించారు.
తాజావార్తలు
-
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
-
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
-
Asim Munir: అసిమ్ మునీర్కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
-
Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
-
Prabhas Fauzi: ప్రభాస్లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!