Nimmala Rama Naidu: రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది: మంత్రి నిమ్మల
- రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి
- ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటు
- 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులు ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి నిమ్మల చెప్పారు. గత ఐదు ఏళ్లలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదని.. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోందన్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా సీఎం సహాయనిధి నుండి రూ.8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ… ‘నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యంను దూరం చేస్తే.. నేడు సీఎం చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది. రైతులు తమ ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది’ అని అన్నారు.
Also Read
‘రైతులు, వ్యవసాయంను గాలికి వదిలేసి ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్ను సైతం తాకట్టు పెట్టిన రైతుల ద్రోహి వైఎస్ జగన్. రైతులను అబద్దాలతో దగా మోసం చేసిన జగన్, వైసీసీ నాయకులకు.. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదు. గత వైసీసీ ఐదేళ్ల పాలనలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలకు గురయ్యారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యంను కొనుగోలు చేసి రైతులను చంద్రబాబు అన్ని విధాల ఆదుకుంటున్నారు. తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యం కల్పించింది. గత అయిదేళ్ళలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోంది’ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!