Nimmala Rama Naidu: రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది: మంత్రి నిమ్మల
- రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి
- ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటు
- 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులు ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి నిమ్మల చెప్పారు. గత ఐదు ఏళ్లలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదని.. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోందన్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా సీఎం సహాయనిధి నుండి రూ.8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ… ‘నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యంను దూరం చేస్తే.. నేడు సీఎం చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది. రైతులు తమ ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది’ అని అన్నారు.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
‘రైతులు, వ్యవసాయంను గాలికి వదిలేసి ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్ను సైతం తాకట్టు పెట్టిన రైతుల ద్రోహి వైఎస్ జగన్. రైతులను అబద్దాలతో దగా మోసం చేసిన జగన్, వైసీసీ నాయకులకు.. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదు. గత వైసీసీ ఐదేళ్ల పాలనలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలకు గురయ్యారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యంను కొనుగోలు చేసి రైతులను చంద్రబాబు అన్ని విధాల ఆదుకుంటున్నారు. తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యం కల్పించింది. గత అయిదేళ్ళలో అధికారులతో రైతులు మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోంది’ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?