NIA: కర్ణాటకలో భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్లోని జంషెడ్పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్ లో పేలుడు పదార్థాలు సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్పౌడర్, చక్కెర, ఇథనాల్ వంటి రసాయనాలను కూడా NIA స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. పదునైన ఆయుధాలు, భారీగా నగదు, స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలతో పాటు నేరారోపణ పత్రాలు ఉన్నాయి.
Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
Also Read
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
ఉగ్రవాద ముఠాకి సూత్రధారిగా ఉన్న మీనాజ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఎనిమిది మందిలో.. సయ్యద్ సమీర్, ముంబైకి చెందిన అనాస్ ఇక్బాల్ షేక్, బెంగళూరులో మహ్మద్ మునీరుద్దీన్, సయ్యద్ సమీవుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజమ్మిల్ ఉన్నారు. ఢిల్లీకి చెందిన షాయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్, జంషెడ్పూర్కు చెందిన మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫీకర్ అలియాస్ గుడ్డులను అరెస్టు చేశారు.
Delhi Liquor Policy Case: మరోసారి కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు
భారతదేశంలో పనిచేస్తున్న అనేక ఐసిస్ మాడ్యూళ్లను ఛేదించడానికి ఎన్ఐఏ 24 గంటలు పనిచేస్తోంది. ఈ క్రమంలో.. దేశంలోని పలు చోట్ల ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. డిసెంబరు 9న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 44 మందిని అరెస్టు చేసింది. తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న అనుమానితులపై డిసెంబర్ 13 న.. ఎన్ఐఏ బెంగళూరులోని అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
- Tags
- Busted
- ISIS
- karnataka
- NIA
- telugu news
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!