Netanyahu: బైడెన్ తీరును తప్పుపట్టిన ఇజ్రాయెల్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హాట్ టాఫిక్గా మారింది.
తన సొంత దేశాన్నే గాయపరిచేలా నెతన్యాహు విధానాలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. హమాస్తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
తాను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే.. అది పూర్తిగా తప్పు అని వ్యాఖ్యానించారు. హమాస్ లెక్కల ప్రకారం.. గాజాలో 31 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సంఖ్య గురించి తనకెలా తెలుస్తుందని తెలిపారు.
ఇజ్రాయెల్ సైనికులు 13 వేల మంది మిలిటెంట్లను మాత్రమే హతమార్చారని నెతన్యాహు తెలిపారు.
ఇదిలా ఉంటే 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్ వైఖరి సొంత దేశాన్నే గాయపరుస్తోందని ఆక్షేపించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు.
అయినా ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు కొనసాగుతుందని బైడెన్ చెప్పుకొచ్చారు. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్ వెల్లడించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల గాజాలో తిండి లేక ప్రజలు అలమటిస్తున్నారు. అయితే ఆయా దేశాలు ట్రక్కుల ద్వారా ఆహ్వారం అందిస్తున్నాయి. వాటి కోసం ప్రజలు ఎగబడుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిరు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!