The Hundred 2026: పాకిస్థాన్ ప్లేయర్లను బహిష్కరించిన ఆ 4 మేజర్ టీమ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Hundred 2026: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. అదేమిటంటే.. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్లో పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఆ నాలుగు మేజర్ జట్లు అస్సలు ఇష్టపడటం లేదట. దీనికి గల కారణాలు, అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్కు ఇది కీలక పరీక్ష!
Also Read
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
వివాదం ఏమిటంటే..
ఈ లీగ్లో మొత్తం 8 జట్లు ఉంటాయి. అందులో నాలుగు జట్ల (మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, MI లండన్, సదరన్ బ్రేవ్, సన్రైజర్స్ లీడ్స్) యజమానులు భారతీయులే. అంటే మన ఐపీఎల్ (IPL) జట్ల యజమానులే ఈ జట్లను కూడా కొనుగోలు చేశారు. భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఈ భారతీయ యజమానులు తమ జట్లలోకి పాకిస్థాన్ ప్లేయర్స్ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి సంబంధించి 2026 మార్చి 11న మహిళా ఆటగాళ్లకు, మార్చి 12న పురుష ఆటగాళ్లకు లండన్లో వేలం జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి దాదాపు 18 దేశాల నుంచి 1,000 మంది ప్లేయర్స్ లిస్టులో ఉండగా.. అందులో 50 మందికి పైగా పాకిస్థాన్ ఆటగాళ్లు ఉన్నారు.
నిజానికి ఆటగాళ్ల జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, జట్లను కొనుగోలు చేసే విషయంలో యజమానులకు స్వయంప్రతిపత్తి ఉంటుంది. అందుకే వారు తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పాక్ ప్లేయర్లకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. గత సీజన్లలో షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజం, హారిస్ రౌఫ్ వంటి స్టార్ ప్లేయర్స్ ఈ లీగ్లో ఆడారు. కానీ ఇప్పుడు లీగ్లో భారతీయ యజమానులు పెరగడంతో, వారికి అవకాశాలు తగ్గిపోనున్నాయని ప్రచారం జరుగుతుంది. కేవలం ఐపీఎల్ లోనే కాకుండా, సౌతాఫ్రికా (SA20), యూఏఈ (ILT20) లీగ్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. సింపుల్గా చెప్పాలంటే.. భారతీయులు ఓనర్స్గా ఉన్న జట్లు పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో, వారు ఈ మెగా లీగ్కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా, క్రీడాపరంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Rashmika Mandanna: కాక్టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!
తాజావార్తలు
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!