Federation Cup 2024: 82.27 మీటర్ల బెస్ట్ త్రో.. బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు.
AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీ..! సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
Also Read
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
నీరజ్ చోప్రా స్వదేశంలో మొదటిసారిగా పోటీలో పాల్గొన్నాడు. నీరజ్, జెనా ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించారు. అందుకే నేరుగా ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఫైనల్స్లో డిపి మనుని ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. డిపి మను తన అత్యుత్తమ ప్రయత్నంతో 82.06 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో కాంస్య పతకాన్ని సాధించాడు. 12 మంది సభ్యుల జావెలిన్ త్రో ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ బాలాసాహెబ్ పాటిల్ 78.39 మీటర్లు విసిరి అత్యుత్తమంగా త్రో చేశాడు.
RR vs PBKS: పంజాబ్ బౌలర్ల దూకుడు.. తక్కువ స్కోరు చేసిన రాజస్థాన్
ఇంతకుముందు దోహా డైమండ్ లీగ్ 2024లో జరిగిన టోర్నీలో నీరజ్ చోప్రా పాల్గొనడం గమనార్హం. దోహా డైమండ్ లీగ్లో రెండో స్థానంలో నిలిచాడు. అక్కడ అత్యుత్తమంగా 88.36 మీటర్ల త్రో చేశాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెజ్ కంటే 3 సెంటీమీటర్ల వెనుకబడి ఉన్నాడు. జాకబ్ అత్యుత్తమంగా 88.38 మీటర్లు విసిరాడు. కాగా.. ఫెడరేషన్ కప్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్తో పాటు కిషోర్ జెనా, డిపి మను, రోహిత్ కుమార్, శివపాల్ సింగ్, ప్రమోద్, ఉత్తమ్ బాలాసాహెబ్ పాటిల్, కున్వర్ అజయ్రాజ్ సింగ్, మంజీందర్ సింగ్, బిబిన్ ఆంటోనీ, వికాస్ యాదవ్ మరియు వివేక్ కుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?