Federation Cup 2024: 82.27 మీటర్ల బెస్ట్ త్రో.. బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు.
AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీ..! సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
నీరజ్ చోప్రా స్వదేశంలో మొదటిసారిగా పోటీలో పాల్గొన్నాడు. నీరజ్, జెనా ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించారు. అందుకే నేరుగా ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఫైనల్స్లో డిపి మనుని ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. డిపి మను తన అత్యుత్తమ ప్రయత్నంతో 82.06 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో కాంస్య పతకాన్ని సాధించాడు. 12 మంది సభ్యుల జావెలిన్ త్రో ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ బాలాసాహెబ్ పాటిల్ 78.39 మీటర్లు విసిరి అత్యుత్తమంగా త్రో చేశాడు.
RR vs PBKS: పంజాబ్ బౌలర్ల దూకుడు.. తక్కువ స్కోరు చేసిన రాజస్థాన్
ఇంతకుముందు దోహా డైమండ్ లీగ్ 2024లో జరిగిన టోర్నీలో నీరజ్ చోప్రా పాల్గొనడం గమనార్హం. దోహా డైమండ్ లీగ్లో రెండో స్థానంలో నిలిచాడు. అక్కడ అత్యుత్తమంగా 88.36 మీటర్ల త్రో చేశాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెజ్ కంటే 3 సెంటీమీటర్ల వెనుకబడి ఉన్నాడు. జాకబ్ అత్యుత్తమంగా 88.38 మీటర్లు విసిరాడు. కాగా.. ఫెడరేషన్ కప్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్తో పాటు కిషోర్ జెనా, డిపి మను, రోహిత్ కుమార్, శివపాల్ సింగ్, ప్రమోద్, ఉత్తమ్ బాలాసాహెబ్ పాటిల్, కున్వర్ అజయ్రాజ్ సింగ్, మంజీందర్ సింగ్, బిబిన్ ఆంటోనీ, వికాస్ యాదవ్ మరియు వివేక్ కుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!