Pakistan Politics: పాకిస్థాన్ తదుపరి ప్రధాని ఆయనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Politics: పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ – పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలోని ఒక వర్గం ఇప్పటికీ బిలావల్ భుట్టో జర్దారీ ప్రధానమంత్రి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అందువల్ల, ఐదేళ్ల ప్రభుత్వ పదవీకాలంలో నాయకత్వానికి సంబంధించి భాగస్వామ్య ఒప్పందం సాధ్యమవుతుంది. ఇందులో మొదటి మూడు సంవత్సరాలు PML-Nకి, చివరి రెండు సంవత్సరాలు PPPకి వెళ్లవచ్చు. మరోవైపు స్వతంత్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు పీఎంఎల్ఎన్లో చేరడం కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పడక ముందే స్టాక్ మార్కెట్ కుదేలైంది. సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వంపై సందేహాలు లేవనెత్తుతూ, సోమవారం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో బలహీనత కనిపించింది. సూచీ వెయ్యి పాయింట్ల డైవ్ తీసుకుంది.
Read Also: Farooq Abdullah: మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
పీటీఐ చీఫ్ గౌహర్ అలీ ఖాన్ సోమవారం దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వాదన నుంచి వెనక్కి తగ్గారు. నవాజ్ షరీఫ్కు పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లతో కలిసి కూర్చోలేమని అన్నారు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో మాట్లాడలేదన్నారు. వారితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలన్నారు. అయితే మనం మెజారిటీలో ఉన్నామని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు జరిగినా, గెలిచిన తర్వాత అత్యధిక సంఖ్యలో పీటీఐ అభ్యర్థులు జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)కి వచ్చారన్నారు. అందుకే బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. పార్లమెంట్లో కూర్చొని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Read Also: Sonia Gandhi: రాజ్యసభకు సోనియా పోటీ.. ఎక్కడ నుంచంటే..!
ఎన్నికల సంఘం విజేతలుగా ప్రకటించిన 101 మంది స్వతంత్రులలో చాలా మందికి పీటీఐ మద్దతు ఉంది. పీఎంఎల్-ఎన్ 75 సీట్లు, పీపీపీ 54, ఎంక్యూఎం 17 సీట్లు గెలుచుకోగా, ఇతర పార్టీలు కూడా 17 సీట్లు గెలుచుకున్నాయి. ఒక సీటు ఫలితాలను ఎన్నికల సంఘం నిలుపుదల చేయగా, ఒక స్థానానికి అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నికలను వాయిదా వేసింది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు 133 మంది ఎంపీల మద్దతు అవసరం. 336 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 266 మంది సభ్యులను ఓటర్లు ఎన్నుకోగా, 70 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నామినేటెడ్ సభ్యులలో 60 మంది మహిళలు కాగా, 10 మంది మైనారిటీ వర్గానికి చెందిన వారు. జాతీయ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు అవసరం.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!