Karumuri Nageswara Rao: అమిత్షా కామెంట్లకు కారుమూరి కౌంటర్.. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే షా మాట్లాడారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. వరుసగా షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఇక, అమిత్షా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. వైసీపీని విమర్శించడానికే అమిత్ షా విశాఖకు వచ్చినట్టున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి.. విశాఖ రైల్వే జోన్, మెట్రో రైలు వంటి అంశాలపై అమిత్ షా మాట్లాడడం లేదని నిలదీశారు.. రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడకపోయినా.. టీడీపీ, బీజేపీ నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో 40 గుళ్లు కూలిస్తే బీజేపీ నేతలు మాట్లాడారా..? అని నిలదీశారు. అమిత్ షా తిరుపతి పర్యటనలో గతంలో టీడీపీ నిరసనలు తెలిపిందని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీని చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శించలేదా? అయినా బీజేపీకి సిగ్గు లేదా..? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Priyanka Gandhi: మిషన్ మధ్యప్రదేశ్ ప్రారంభం. ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ..!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అన్నింటిలోనూ ఏపీ నంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే.. అవినీతి అంటూ అమిత్ షా కామెంట్లు చేస్తారా..? అని నిలదీశారు కారుమూరి.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్న అమిత్ షా.. ఇప్పుడిలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. బహిరంగ సభ వేదిక మీద అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.. టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతల మనస్సు ఓ చోట.. మనిషి ఓ చోట అన్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, అమిత్ షా సొంతంగా మాట్లాడారని అనుకోవడం లేదన్న ఆయన.. ఎవరో చెప్పిన మాటలు విని అమిత్ షా ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు.. కర్ణాటకలో బీజేపీ పరిస్థితేం అయిందో చూశారుగా.. ఇక్కడ.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వచ్చినా జగన్ను ఏం చేయలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంట్లో మనిషిలా మారారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలదే.. గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు విషయంలో ఏం చేశారో.. మేమూ అదే చేశాం అన్నారు. రైతులు రొడ్డేక్కి కేంద్రానికి ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు.. దీనికి అమిత్ షా సిగ్గు పడాలని హితవుపలికారు. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే అమిత్ షా మాట్లాడారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..