National Women Commission : ఉత్తరప్రదేశ్లో మహిళలపై వేధింపులు ఎక్కువట.. 2022 రౌండప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో స్త్రీలకు ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు. అయితే.. అలాంటి భారతావనిలో రోజు రోజుకు ఆడవారిపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అయితే.. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు 2022లో జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. అయితే.. ఇది 2014 తర్వాత అత్యధికమని జాతీయ మహిళా కమిషన్ తెలిపారు. 2021లో జాతీయ మహిళా కమిషన్కి 30,864 ఫిర్యాదులు అందగా, 2022లో ఆ సంఖ్య 30,957కి స్వల్పంగా పెరిగిందని ఎన్సీడబ్యూ అధికారులు తెలిపారు. ఎన్సీడబ్యూ అధికారులు డేటా ప్రకారం.. 30,957 ఫిర్యాదులలో, గరిష్టంగా 9,710 మహిళల మానసిక వేధింపులను పరిగణనలోకి తీసుకునే గౌరవంగా జీవించే హక్కుకు సంబంధించినవి, ఆ తర్వాత గృహ హింసకు సంబంధించినవి 6,970 మరియు వరకట్న వేధింపులకు సంబంధించినవి 4,600 ఉన్నాయని ఎన్సీడబ్యూ అధికారులు పేర్కొన్నారు.
Also Read : Tips For Oil Skin: ఆయిలీ స్కిన్తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే!
అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 54.5 శాతం (16,872) ఫిర్యాదులు అందాయి. ఢిల్లీలో 3,004 ఫిర్యాదులు నమోదయ్యాయి, మహారాష్ట్ర (1,381), బీహార్ (1,368), హర్యానా (1,362) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గౌరవంగా జీవించే హక్కు, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో అత్యధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాయని ఎన్సీడబ్యూ అధికారులు పేర్కొన్నారు. ప్యానెల్ 33,906 ఫిర్యాదులను స్వీకరించిన 2014 తర్వాత 2022లో ఎన్సీడబ్యూకి అందిన ఫిర్యాదుల సంఖ్య అత్యధికం. మహిళల పట్ల అసభ్యత లేదా వేధింపులకు సంబంధించిన నేరాలకు సంబంధించి 2,523 ఫిర్యాదులు అందగా, 1,701 అత్యాచారం మరియు అత్యాచార యత్నాలకు సంబంధించినవి, 1,623 ఫిర్యాదులు మహిళలపై పోలీసుల ఉదాసీనత మరియు 924 ఫిర్యాదులు సైబర్ నేరాలకు సంబంధించినవని ఎన్సీడబ్యూ అధికారులు తెలిపారు.
Also Read : Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!