DSP Ajay Pratap Singh: రూ.2.5కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ డీఎస్పీ.. అరెస్ట్ చేసిన సీబీఐ..
- తనను ఇరికిస్తానని బెదిరించి రూ.2.5 కోట్లు డిమాండ్
- అరెస్ట్ చేసిన సీబీఐ పోలీసులు
- నిందితుడు ఎన్ఐఏ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనను ఇరికిస్తానని బెదిరించి రూ.2.5 కోట్లు డిమాండ్ చేసిన ఎన్ఐఏ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ సహా ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ వివరాల ప్రకారం.. బీహార్ రాజధాని పట్నాలో ఎన్ఐఏ యూనిట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పని చేస్తున్న అజయ్ ప్రతాప్సింగ్.. లైసెన్స్ లేని ఆయుధాలు సరఫరా చేస్తున్నారని చెప్పి ఓ కుటుంబం నుంచి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయగా.. సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో రూ.20 లక్షల విలువైన లంచం నగదుతో పాటు పలు అభ్యంతరకర పత్రాలు, డిజిటల్ వస్తువులు స్వాధీనం చేసుకుంది.
READ MORE: Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
వాస్తవానికి సెప్టెంబర్ 19న నగరంలోని ఏపీ కాలనీలో ఉన్న జేడీయూ మాజీ ఎమ్మెల్సీ మనోరమా దేవి ఇంటిపై ఎన్ఐఏ బృందం దాదాపు 18 గంటల పాటు సోదాలు నిర్వహించింది. మనోరమా దేవి ఇంట్లో ఎన్ఐఏ 4.3 కోట్ల రూపాయల నగదు, అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఎన్ఐఏ పాట్నా బ్రాంచ్ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. నక్సలైట్ కేసులో ఇరికిస్తామని బెదిరించి మాజీ ఎమ్మెల్సీ మనోరమ్ దేవి, ఆమె పెద్ద కుమారుడు రాకీ యాదవ్ల నుంచి ఎన్ఐఏ డీఎస్పీ రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. దీంతో రాకీ యాదవ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు.
సెప్టెంబర్ 26న బాధితుడి నుంచి సింగ్.. రూ. 25 లక్షలు ముట్టచెప్పాలని డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ఉన్న మరొకరి మొబైల్ సాయంతో చెల్లించాల్సిన డబ్బులు, వివరాలను మెసేజ్ రూపంలో పంపాడు. డబ్బులు సమకూర్చాక అదే నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పాడు. అలా రూ.25 లక్షలు ఔరంగాబాద్కు చెందిన ఓ మధ్యవర్తికి అందాయి. అక్టోబర్ 1న యాదవ్ను సింగ్ మళ్లీ పిలిపించాడు. రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సిబిఐ బృందం అర్ధరాత్రి మనోరమ్ దేవి ఇంటి నుంచి 20 లక్షల రూపాయల లంచంతో గయ నుంచి డీఎస్పీకి చెందిన ఇద్దరు ఏజెంట్లను రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసింది. అదే సమయంలో.. ఎన్ఐఏ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ను కూడా పాట్నా నుంచి అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!