కేసీఆర్ మాటలు జగన్కు అవమానంగా అనిపించలేదా?: లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయడం సీఎంగా మీకు అవమానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రులకు మాత్రం ఆ వ్యాఖ్యలు తీరని అవమాకరంగా భావిస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ సర్కారు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని, ప్రభుత్వం నియమించిన రత్నకుమారి కమిటీ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండానే నివేదిక ఇచ్చిందని లోకేష్ ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులతో కమిటీ చర్చలు జరపలేదన్నారు. ప్రభుత్వం కోరిన నివేదిక ఇచ్చిందని వస్తున్న ఆరోపణలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు.
Read Also: టీటీడీ డైరీ, క్యాలెండర్ల పేరిట కేటుగాళ్ళ దందా
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఏపీలో ఎయిడెడ్ సంస్థల్ని యథావిధిగా కొనసాగించాలని… ఏ ఒక్క స్కూలు మూతపడకుండా చూడాలని లేఖలో లోకేష్ కోరారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవుతున్నాయని వాపోయారు. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం.. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకి మరణశాసనంగా మారిందన్నారు. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేయాలనేది పాలకుడి లక్ష్యమైతే… ఒకే ఒక్క విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే చాలని తత్వవేత్త మాకియవెల్లి అన్నారని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దాడి చూస్తుంటే, అన్ని వ్యవస్థల ధ్వంసానికి తెగబడుతున్నట్టే అనిపిస్తోందన్నారు. అమ్మ ఒడి ఇవ్వడానికి ..కొడుకు బడిని బలిపీఠంపై ఎక్కించడం భావ్యమేనా అని ప్రశ్నించారు.
Read Also: ఏపీలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు
మొన్న వైజాగ్, నిన్న కాకినాడ, నేడు గుంటూరు, రేపు మరో ప్రాంతం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నారని.. ఇంత జరుగుతోన్నా మీ మూర్ఖ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారంటే ఏమనుకోవాలి? అంటూ లోకేష్ తన లేఖలో జగన్ను నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,203 ఎయిడెడ్ పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు, 182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులు, 116 డిగ్రీ కాలేజీల్లో 2.50 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ప్రశార్ధకం కానుందన్నారు. ఎన్నోఏళ్ల నుంచి లక్షలాది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆ నిరుపేదలకు దూరం చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని లోకేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!