Nandamuri Thaman: నారా భువనేశ్వరి నోట నందమూరి తమన్ కామెంట్స్
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్
- అధికారికంగా ప్రకటించిన మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
- నందమూరి తమన్ అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Thaman: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతోండగా ఈరోజు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఇది ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం అని వెల్లడించారు.
Read Also:Kamala Harris: కమలా హారిస్ ఫ్యూచర్ ఫ్లాన్ ఇదేనా? 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారంటే..!
Also Read
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
ఇక ఈ కార్యక్రమం ద్వారా రైజ్ అయిన ఫండ్స్ ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల సేమియా వ్యాధి క్యాంపులకు, తల సేమియా వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కి ఉపయోగించబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆలోచన చేసి ఫండ్స్ రైజ్ చేసి ముందుకు ఎలా వెళ్లాలి? అని అనుకుంటూ ఉండగా తమకు ముందుగా ఒకటే పేరు గుర్తు వచ్చిందని, అది ఎన్ తమన్ అని అన్నారు. అయితే వెంటనే సారీ చెప్పి నందమూరి తమన్ అంటూ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా తమన్ నందమూరి బాలకృష్ణతో ట్రావెల్ చేస్తున్నారు. బాలకృష్ణ చేసున్న అన్ని సినిమాలకి తమన్ సంగీతం అందిస్తున్నారు.. నందమూరి బాలకృష్ణకి తమన్ అందించే మ్యూజిక్ వేరు ఇతర హీరోలకి ఇచ్చి మ్యూజిక్ వేరు అన్నట్టుగా సోషల్ మీడియా నెటిజన్లు తమన్ కి నందమూరి తమన్ అంటూ నామకరణం చేశారు.
Read Also:HYDRA PS: బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్
అది ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సహా పలువురు పలు వేదికల మీద ప్రస్తావించారు. ఇక ఇప్పుడు నారా భువనేశ్వరి కామెంట్ చేయడం గమనార్హం. ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో తమన్ తో పాటు శివమణి కూడా డ్రమ్స్ ప్లే చేయబోతున్నారు, అంతే కాక దేశవ్యాప్తంగా ఉన్న 50 మంది ఆర్టిస్టులు ఈ షోలో పర్ఫామ్ చేయనున్నారు. తమన్ సంక్రాంతి సందర్భంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందించిన రాంచరణ్ తేజ గేమ్ చెంజర్ చిత్రంతోపాటు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలకు సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!