National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Flag Day: ప్రతి ఏటా జూలై 22న భారతదేశం జాతీయ జెండా దినోత్సవం (National Flag Day) జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్య రాకముందు, అంటే సరిగ్గా కొన్ని రోజుల ముందే జూలై 22న రాజ్యాంగ పరిషత్ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. భారతీయుల ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే మన మువ్వన్నెల జెండాను గౌరవించుకోవడానికి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైనది. మన జాతీయ జెండాను ‘తిరంగా’ అని పిలుస్తారు. ఇందులో సమానమైన వెడల్పు కలిగిన మూడు రంగుల పట్టీలు ఉంటాయి. పైన ఉండే కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి చిహ్నం అయితే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ సమృద్ధికి, అభివృద్ధికి సూచిక. శ్వేత వర్ణ పట్టీ మధ్యలో నివిల రంగులో ఉండే 24 ఆకులతో కూడిన అశోక చక్రం ధర్మచక్రానికి, దేశ నిరంతర పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3 లో ఉంటుంది. స్వాతంత్ర్యానికి కొద్ది వారాల ముందు జెండా డిజైన్లో ఓ ముఖ్యమైన మార్పు చేశారు. అంతకుముందు స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ, ఆత్మనిర్భరతకు గుర్తుగా ఉన్న ‘చరఖా’ (రాట్నం) స్థానంలో అశోక చక్రాన్ని చేర్చారు. బద్రుద్దీన్ త్యాబ్జీ సూచించిన ఈ మార్పును మహాత్మా గాంధీ కూడా సంపూర్ణంగా ఆమోదించారు.
మరోవైపు 2002లో భారత ప్రభుత్వం జెండా నిబంధనలలో (Flag Code of India) సవరణలు చేసింది. అంతకుముందు కేవలం జాతీయ పండగల సమయంలోనే ప్రజలు జెండాను ఎగురవేసే అవకాశం ఉండగా, ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశ పౌరులు ఏడాది పొడవునా పూర్తి గౌరవప్రదంగా జాతీయ జెండాను ఎగురవేసే హక్కును పొందారు. అయితే, సాధారణంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే జెండాను ఎగురవేయాలి (రాత్రి వేళల్లో తగిన వెలుతురు ఉంటేనే అనుమతి ఉంటుంది). ఇక, దేశ స్వాతంత్ర్య పోరాటం, త్యాగాలు, ఆదర్శాలను గుర్తుచేసే ఈ రోజున పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాకు వందనం చేస్తూ దాని విశిష్టతను చాటిచెబుతారు. ప్రతి భారతీయుడికి తన దేశం పట్ల ఉండే ఐక్యతను, బాధ్యతను ఈ రోజు నిరంతరం గుర్తుచేస్తుంది.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!