Balakrishna: నందమూరి తారక రామారావు కేవలం ఒక పేరు కాదు.. చరిత్ర
- సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన నందమూరి బాలకృష్ణ.
- సీనియర్ ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన బాలకృష్ణ.
- నందమూరి తారక రామారావు అనే పేరు కేవలం వ్యక్తి పేరు కాదు.. ఒక చరిత్ర అంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక చరిత్ర అని అన్నారు. నటనలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను జీవంగా మలిచిన నటదిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు, కృషికి, అంకితభావానికి తలవంచని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు. నటరత్న, నటధీరుడు ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో వెలుగుచేసిన ఒక కాంతి అని, ఆయన నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిలించాయని అన్నారు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళ పాత్రల్లో ఆయన వేసిన అభినయం, శరీరభాష ప్రజలను ఆ పాత్రలతో మమేకం చేసిందని.. నిజంగా, ప్రతి తెలుగు వాడిని “నేను తెలుగు వాడిని” అని గర్వంగా చెప్పుకొనేలా చేసినవారు ఎన్టీఆర్ అని అన్నారు.
Also Read: SSIA: సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
నటనలో విజయంతో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి, పేద ప్రజలకు అండగా నిలిచారని, ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో అమలైన అనేక పథకాలు ఇప్పటికీ ప్రజల మదిలో ఆయనను చిరస్మరణీయుడిగా నిలిపాయని గుర్తు చేసారు. రెండు రూపాయల బియ్యం పథకం ఎన్టీఆర్ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని, మండల వ్యవస్థ ఏర్పాటు, పాలనను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసిందని తెలిపారు. చెన్నై నగరానికి నీటి సరఫరా చేసి భగీరథుడిగా ప్రశంసలు పొందారని, పేదవారికి సొంత ఇళ్ల కలను సాకారం చేశారని కొనియాడారు.
Also Read: Formula E race inquiry: ఏసీబీ విచారణలో గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు
ఎన్టీఆర్ నిజమైన ప్రజానాయకుడని, పేద ప్రజల ఆకలి బాధలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచిన అన్న అంటూ పేర్కొన్నారు. మహిళలకు అన్నగా, యువతకు ఆదర్శంగా ఎన్టీఆర్ తానే ప్రత్యేకమన్నారు. ఆయన రాజకీయ విధానాలు, ప్రజలకు అందించిన సేవలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పొగిడారు. ఎన్టీఆర్ శివైకం అయ్యి 29 ఏళ్లు గడిచినా, ఆయన ప్రతిభ ప్రజల గుండెల్లో నిత్యజీవిగా ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు మన మదిలో, ఆయన చిరునవ్వు మన గుండెల్లో, ఆయన చేసిన సేవలు మన జీవితాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయని, ఒక నటుడిగా.. నాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు ప్రతి తెలుగువాడికి గర్వకారణమని, ఎన్టీఆర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. తెలుగువారి గర్వకారణమైన చరిత్ర అని బాలకృష్ణ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!