Balakrishna: నందమూరి తారక రామారావు కేవలం ఒక పేరు కాదు.. చరిత్ర
- సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన నందమూరి బాలకృష్ణ.
- సీనియర్ ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన బాలకృష్ణ.
- నందమూరి తారక రామారావు అనే పేరు కేవలం వ్యక్తి పేరు కాదు.. ఒక చరిత్ర అంటూ వ్యాఖ్యలు.
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక చరిత్ర అని అన్నారు. నటనలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను జీవంగా మలిచిన నటదిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు, కృషికి, అంకితభావానికి తలవంచని తెలుగు ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు. నటరత్న, నటధీరుడు ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో వెలుగుచేసిన ఒక కాంతి అని, ఆయన నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిలించాయని అన్నారు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళ పాత్రల్లో ఆయన వేసిన అభినయం, శరీరభాష ప్రజలను ఆ పాత్రలతో మమేకం చేసిందని.. నిజంగా, ప్రతి తెలుగు వాడిని “నేను తెలుగు వాడిని” అని గర్వంగా చెప్పుకొనేలా చేసినవారు ఎన్టీఆర్ అని అన్నారు.
Also Read: SSIA: సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
Also Read
నటనలో విజయంతో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని బాలకృష్ణ అన్నారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి, పేద ప్రజలకు అండగా నిలిచారని, ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో అమలైన అనేక పథకాలు ఇప్పటికీ ప్రజల మదిలో ఆయనను చిరస్మరణీయుడిగా నిలిపాయని గుర్తు చేసారు. రెండు రూపాయల బియ్యం పథకం ఎన్టీఆర్ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని, మండల వ్యవస్థ ఏర్పాటు, పాలనను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసిందని తెలిపారు. చెన్నై నగరానికి నీటి సరఫరా చేసి భగీరథుడిగా ప్రశంసలు పొందారని, పేదవారికి సొంత ఇళ్ల కలను సాకారం చేశారని కొనియాడారు.
Also Read: Formula E race inquiry: ఏసీబీ విచారణలో గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు
ఎన్టీఆర్ నిజమైన ప్రజానాయకుడని, పేద ప్రజల ఆకలి బాధలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచిన అన్న అంటూ పేర్కొన్నారు. మహిళలకు అన్నగా, యువతకు ఆదర్శంగా ఎన్టీఆర్ తానే ప్రత్యేకమన్నారు. ఆయన రాజకీయ విధానాలు, ప్రజలకు అందించిన సేవలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పొగిడారు. ఎన్టీఆర్ శివైకం అయ్యి 29 ఏళ్లు గడిచినా, ఆయన ప్రతిభ ప్రజల గుండెల్లో నిత్యజీవిగా ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు మన మదిలో, ఆయన చిరునవ్వు మన గుండెల్లో, ఆయన చేసిన సేవలు మన జీవితాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయని, ఒక నటుడిగా.. నాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు ప్రతి తెలుగువాడికి గర్వకారణమని, ఎన్టీఆర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. తెలుగువారి గర్వకారణమైన చరిత్ర అని బాలకృష్ణ తెలిపారు.
తాజావార్తలు
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!