Nama Nageswara Rao: కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పై ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విరుచుకు పడ్డారు. మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మటంతో పెద్ద నష్టం జరిగిపోయిందన్నారు. రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగ బలహీన వర్గాల అభివృద్ధి కి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలిపారు.
READ MORE: Nandamuri Balakrishna: గుడ్లూరులో బాలయ్య ప్రచారం.. ప్రభుత్వంపై పంచ్లు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ప్రజలు జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాడలేదని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చే సరికి హైద్రాబాద్ నుండి దిగుమతి చేశారని తెలిపారు. తెచ్చిన సూట్ కేస్ తో ఎన్నికలు అయిన తరువాత తిరిగి వెళ్ళిపోతారని విమర్శించారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నామా నాగేశ్వరరావు కంకణం కట్టుకున్నారు. ఈయన గతంలో ఖమ్మం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2009లో తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!