Kiran Kumar Reddy: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తొలి ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన త్వరత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మెదటసారి బహిరంగ సభలో మాట్లాడారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిర్వహించిన సభలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అయితే, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తెలిపారు. అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని దుబ్బాక, హుజూరాబాద్ ల్లో బీజేపీ గెలిచింది ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.
Read Also: Locket Chatterjee: పశ్చిమ బెంగాల్లోనూ మణిపూర్ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ని గద్దె దింపి బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావటానికి తాను కూడా కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Rajamouli: కల్కి ఫస్ట్ గ్లింప్స్.. ఆ ఒక్కటి మిస్ అయ్యింది
కారు తాళాలు మనం తీసుకోవాలి అని బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కారు స్టీరింగ్ తమ దగ్గర ఉందని పతంగి పార్టీ వాళ్ళు అంటుంటారు.. తాళాలు తీసుకుంటే కారు ముందుకు వెళ్ళదు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. బండి సంజయ్ బీజేపీ పార్టీలో జోష్ తెచ్చారు.. కిషన్ రెడ్డి పార్టీనీ అధికారంలోకి తెచ్చే సత్తా ఉంది అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2004లో సైకిల్ వెనకాల బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నారని నేనే విమర్శించాను.. ఇప్పుడు నేనే బీజేపీలో రావాల్సి వచ్చింది.. బీజేపీకి ఎన్నికకు ఎన్నికకు ఓట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!