Nallamilli Ramakrishna Reddy: ప్రజల ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అనపర్తి టికెట్ దక్కకపోవడంతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallamilli Ramakrishna Reddy: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్ వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అనపర్తి టికెట్ వ్యవహారం అసంతృప్తి జ్వాలలకు కారణం అవుతోంది.. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ స్థానం వెళ్లిపోవడంతో.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు.. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను కూడా దగ్ధం చేశారు.. అయితే, నేటి నుండి అనపర్తి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల ముందుకు వెళ్లనున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. అనపర్తి టిక్కెట్ విషయమై తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని చెబుతున్నారు.
Also Read
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
అనపర్తి, రంగంపేట, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. రోజుకు ఒక్కొక్క మండలంలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు.. ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తే.. టిక్కెట్ విషయంలో టీడీపీ అధిష్టానం అన్యాయం చేసిందని ఆవేదనతో ఉన్నారు నల్లమిల్లి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ తనకు టిక్కెట్ రాకుండా కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు.. ఇక, నాలుగు రోజుల పర్యటన అనంతరం కార్యకర్తలతో సమావేశం కానున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ప్రజల అధిష్టానం మేరకు నిర్ణయం ఉంటుందని అంటున్నారు.. అయితే, టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలంటూ ఆయన అనుచరుల నుంచి రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెరుగుతోందట.. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారట.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారట.. కానీ, తాను నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించానని చెబుతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనపర్తి మండలం మహేంద్రవాడ నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటన ప్రారంభం కానుంది.. ఈ పరిణామాలు అనపర్తిలో ఎలాంటి వాతావరణన్ని సృష్టిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!