Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ కాంబో అదిరిపోయింది. పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. చాలా గ్యాప్ తరువాత నాగ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. అసలు ఈ సినిమా సంక్రాంతి రేస్ లోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. గతేడాది సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. కేవలం మూడు నెలలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని బరిలో దిగడమంటే మాటలు కాదు. సంక్రాంతి- నాగార్జున బెస్ట్ కాంబినేషన్. ఇక ఈ సినిమాకు కీరవాణీ స్టార్ అని నాగ్ నే చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్ ను అందుకోవడంతో తాజాగా నా సామీ రంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. ముఖ్యంగా సంక్రాంతి రేసులో తన సినిమాను ఉండనిచ్చినందుకు ఫిల్మ్ కౌన్సిల్ కు థాంక్స్ చెప్పాడు. ఇక సినిమాను ఇంతగా ఆదరించిందినందుకు అభిమానులకు థాంక్స్ చెప్పాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టామని, సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్తే ఎవ్వరు తనను నమ్మలేదని, చివరికి నా కొడుకులు, అమల కూడా నమ్మలేదని తెలిపాడు. అంతేకాకుండా బయట ఎక్కడ అయినా చెప్తే.. పిచ్చి పట్టిందా.. ? ఏంటి అన్నట్లు చూసేవారని, కేవలం తన టీమ్ మాత్రమే తనను నమ్మిందని అన్నాడు. ఇక చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. కీరవాణీ వలనే ఈ సినిమా సాధ్యమైందని, ఆయన టైమ్ టేబుల్ ఇచ్చి తమ బృందాన్ని ముందుకు తోశారని చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని చెప్పడంతో.. నాగ్ హింట్ ఇచ్చేశాడని, కొత్త సినిమాతో రాబోతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..