Naga Chaitanya: శోభితాతో అన్ని విషయాలు పంచుకుంటా.. ఎందుకంటే?
- ‘తండేల్’ ప్రమోషన్లో నాగచైతన్య
- ఓ జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ
- తన సతీమణి గురించి కీలక విషయాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లు కూడా అదే రేంజ్లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
READ MORE: Chandrababu: నిర్మలమ్మ బడ్జెట్ను స్వాగతించిన చంద్రబాబు.. ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు
Also Read
తన జీవిత భాగస్వామి శోభితాతో అన్ని విషయాలు పంచుకుంటానని నాగ చైతన్య చెప్పాడు. పలు కీలక విషయాల్లో అయోమయానికి లోనైతే.. ఆమె తనకు ఎంతో చేయూతనిస్తుందని తెలిపాడు. పలు సూచనలు కూడా ఇస్తుందని వెల్లడించాడు. తన సతీమణితో జీవితాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. “నాకు తట్టిన ప్రతి ఆలోచనను ఆమెతో పంచుకుంటాను. ఏ విషయంలోనైనా గందరగోళానికి గురైతే.. నా సతీమణికి విషయాన్ని చెబుతాను. నేను ఒత్తిడికి లోనైతే తాను వెంటనే గ్రహిస్తుంది. ఏమైందని జరిగిందంతా తెలుసుకుంటుంది. మంచి సూచనలు సైతం ఇస్తుంది. ఆమె చెప్పే సలహాలు ఇవ్వరినీ ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. అందుకే తన నిర్ణయాన్ని ఎల్లవేళలా గౌరవిస్తుంటాను.” అని నాగ చైతన్య స్పష్టం చేశారు.
READ MORE: Samantha: వారిని కఠినంగా శిక్షించాలి.. సమంత పోస్ట్ వైరల్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..