జగన్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు క్షోభలో ఉంటే సైకో జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. కావాలని సమస్య సృష్టించి రాక్షస ఆనందంతో బతికే వ్యక్తి జగన్ అని ఆయన ఆరోపించారు. ఒక ఇంట్లో అనారోగ్యంతో మహిళ బాధపడుతున్నారని, మరో చోట పెళ్లి పెట్టుకున్న ఇంటిని కూలగొట్టారన్నారు. పాత మార్కింగ్ సమయంలో స్వచ్ఛందంగా ప్రజలే ప్రహరీ పడగొట్టుకున్నారని, ఇప్పుడు కాలువలు దాటి కొత్త మార్కింగ్ పెట్టడం దుర్మార్గమన్నారు. జనసేనకు సభ ఇచ్చారని కక్ష కడతారా..? అని ఆయన మండిపడ్డారు.
Also Read : Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే
మాకు సహకరించిన ప్రజలకు మేము అండగా ఉంటామన్న ఆయన.. మరోసారి అధికారులు ఇక్కడ హడావుడి చేస్తే ఊరుకోమన్నారు. మచిలీపట్నం సభకు ఆటంకాలు కలిగించేందుకు ఇక్కడ ఇబ్బంది పెడతారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి జగన్కి పిచ్చెక్కిందన్నారు. రోజు కూలి చేసుకునే వాళ్లపైనా నీ ప్రతాపమని, 151మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది ఇలాంటి దాడి చేయమనా..? 175 ఎమ్మెల్యేలను మీకు ఇస్తే ప్రజలను బతకనిస్తారా..? దమ్ముంటే అంటున్నారుగా.. వైసిపి నాయకులు ఇక్కడకి రండి.. వీళ్లని చూడండి. అధికారులకు కూడా తప్పు చేస్తున్నామని అర్థం అయ్యింది. మా అధినేత బాధ్యతగా ఇక్కడకు వచ్చారు..
Also Read : Summer Tips: వేసవిలో ఇవి తీసుకుంటే సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా.. మీరు చల్లగా ఉంటారు
ధ్వంసాలు, విధ్వంసాలే జగన్ పాలన. పేదల కన్నీటిని చూసేందుకు జగన్ పాలన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మా పోరాటం కొనసాగుతుంది. ఈ సైకో సీఎం వచ్చే ఎన్నికల తరువాత తప్పకుండా ఇంటికి వెళ్లడం ఖాయం.’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.