Tata Motors: పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఏప్రిల్ 1 నుంచే అమలు…
- టాటా మోటార్స్ కార్లు కొనే వారికి బిగ్ షాక్..
- ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న కార్ల ధరలు..
- స్టీల్, అల్యుమినియం ముడి పదర్థాల ధరలు పెరగడమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా మోటార్స్ కార్లు కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తన పెట్రోల్ , డీజిల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. సగటున 0.5 శాతం మేర ధరలు పెరగనున్నాయి. అయితే.. మీరు ఎంచుకునే కారు మోడల్ , వేరియంట్ను బట్టి ఈ ధరల పెంపులో మార్పులు ఉండవచ్చు. అంటే కొన్ని కార్లపై తక్కువగా, మరికొన్నింటిపై కొంచెం ఎక్కువగా ప్రభావం ఉండవచ్చు. కేవలం పెట్రోల్, డీజిల్ (ICE) వాహనాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.
Also Read:Ration Card Holders: తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త.. జూన్ 2 నుంచే ప్రారంభం..
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?
కార్లు తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల (స్టీల్, అల్యూమినియం వంటివి) ధరలు పెరగడం, రవాణా ఖర్చులు ఎక్కువ కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ అదనపు భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఇతర కంపెనీలతో పోటీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులపై మరీ ఎక్కువ భారం పడకుండా చాలా తక్కువ మొత్తంలోనే ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది.
ఏ ఏ కార్లపై ప్రభావం ఉంటుంది..?
టాటా మోటార్స్కు చెందిన ప్రముఖ మోడల్స్ అయిన హ్యాచ్బ్యాక్, సెడాన్ , ఎస్యూవీ (SUV) విభాగాల్లోని అన్ని పెట్రోల్, డీజిల్ కార్లకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. మీరు మార్చి నెలాఖరులోపు కారు బుక్ చేసుకుంటే పాత ధరలకే పొందే అవకాశం ఉండవచ్చు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!