Maha Kumbh Mela 2025: స్నానం ఆచరించిన యూపీ కేబినెట్.. కొద్దిసేపు జలకలాట
- మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్
- కొద్దిసేపు జలకలాట లాడిన సీఎం యోగి, మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానం చేశారు. అంతేకాకుండా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనేకమైన ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగ్రాజ్-చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రయాగ్రాజ్ మరియు పరిసర ప్రాంతాల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాగ్రాజ్ని మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీకి కలుపుతూ.. ఘాజీపూర్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేకి అనుసంధానం చేస్తూ గంగా ఎక్స్ప్రెస్వే పొడిగింపును చేపట్టబడుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం అనంతరం చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు. ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
प्रयागे तु नरो यस्तु माघस्नानं करोति च।
न तस्य फलसंख्यास्ति शृणु देवर्षिसत्तम।।महाकुम्भ-2025, प्रयागराज में मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान… https://t.co/SrkEhXNsU6
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
तत्राभिषेकं यः कुर्यात् संगमे शंसितव्रतः।
तुल्यं फलमवाप्नोति राजसूयाश्वमेधयोः॥एकता, समता और समरसता के महासमागम, भारतीयता और मानवता के महोत्सव, महाकुम्भ-2025, प्रयागराज में आज अपने मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान का सौभाग्य प्राप्त हुआ।
माँ… pic.twitter.com/W9er56u5FD
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?