Maha Kumbh Mela 2025: స్నానం ఆచరించిన యూపీ కేబినెట్.. కొద్దిసేపు జలకలాట
- మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్
- కొద్దిసేపు జలకలాట లాడిన సీఎం యోగి, మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానం చేశారు. అంతేకాకుండా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనేకమైన ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగ్రాజ్-చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రయాగ్రాజ్ మరియు పరిసర ప్రాంతాల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాగ్రాజ్ని మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీకి కలుపుతూ.. ఘాజీపూర్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేకి అనుసంధానం చేస్తూ గంగా ఎక్స్ప్రెస్వే పొడిగింపును చేపట్టబడుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం అనంతరం చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు. ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
प्रयागे तु नरो यस्तु माघस्नानं करोति च।
न तस्य फलसंख्यास्ति शृणु देवर्षिसत्तम।।महाकुम्भ-2025, प्रयागराज में मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान… https://t.co/SrkEhXNsU6
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
तत्राभिषेकं यः कुर्यात् संगमे शंसितव्रतः।
तुल्यं फलमवाप्नोति राजसूयाश्वमेधयोः॥एकता, समता और समरसता के महासमागम, भारतीयता और मानवता के महोत्सव, महाकुम्भ-2025, प्रयागराज में आज अपने मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान का सौभाग्य प्राप्त हुआ।
माँ… pic.twitter.com/W9er56u5FD
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
తాజావార్తలు
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!