Maha Kumbh Mela 2025: స్నానం ఆచరించిన యూపీ కేబినెట్.. కొద్దిసేపు జలకలాట
- మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్
- కొద్దిసేపు జలకలాట లాడిన సీఎం యోగి, మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానం చేశారు. అంతేకాకుండా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనేకమైన ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగ్రాజ్-చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రయాగ్రాజ్ మరియు పరిసర ప్రాంతాల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాగ్రాజ్ని మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీకి కలుపుతూ.. ఘాజీపూర్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేకి అనుసంధానం చేస్తూ గంగా ఎక్స్ప్రెస్వే పొడిగింపును చేపట్టబడుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం అనంతరం చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు. ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
प्रयागे तु नरो यस्तु माघस्नानं करोति च।
न तस्य फलसंख्यास्ति शृणु देवर्षिसत्तम।।महाकुम्भ-2025, प्रयागराज में मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान… https://t.co/SrkEhXNsU6
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
तत्राभिषेकं यः कुर्यात् संगमे शंसितव्रतः।
तुल्यं फलमवाप्नोति राजसूयाश्वमेधयोः॥एकता, समता और समरसता के महासमागम, भारतीयता और मानवता के महोत्सव, महाकुम्भ-2025, प्रयागराज में आज अपने मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान का सौभाग्य प्राप्त हुआ।
माँ… pic.twitter.com/W9er56u5FD
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!