Muralidhar Rao: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు కోవర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏషియన్ గేమ్స్ లో వందకు పైగా పథకాలు సాధించడం వెనుక మోడీ కృషి ఉంది అని బీజేపీ నేత మురళి ధర్ రావు అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పని చేస్తుంది.. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించాము.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్.. సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్నారు.. ఇంతకన్నా కుటుంబ పాలన కు ఉదాహరణ ఏమీ కావాలి.. బావ బావమరిదులు రాష్ట్రాన్ని సగం సగం పంచుకున్నట్టు కనిపిస్తుంది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో కాన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తుంది.. మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వంద శాతం లబ్ది దారులకు చేరాయి.. టైం ప్రకారం డెలివరీ చేస్తుంది మోడీ సర్కార్ మాత్రమే అని మురళి ధర్ రావు తెలిపారు.
Read Also: PM Modi Speech: ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలపై ప్రధాని మోడీ సమీక్ష
Also Read
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
- Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
మోడీ పథకాలకు కేసీఆర్ పథకాలకు మధ్య ఉన్న తేడాను ప్రజలకి వివరిస్తాము అని మురళి ధర్ రావు పేర్కొన్నారు. పూర్తి మెజారిటీ బీజేపీకి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. తెలంగాణ ప్రజలను ఎలక్షన్ సర్వేలు అంచనా వేయలేవు.. తెలంగాణలో యువత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంది.. కాంగ్రెస్ నమ్మకం లేని పార్టీ, భరోసా ఇవ్వలేని పార్టీ.. ఆ పార్టీ ది అరువు తెచ్చుకునే పరిస్థితి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళారీ వ్యవస్థ నడవాలనుకునే వారు లేని కాంగ్రెస్ ను పిక్చర్ లోకి తీసుకువస్తున్నారు.. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కోవర్ట్.. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే సమావేశం బీజేపీ కౌన్సిల్ లో జరిగింది అని మురళి ధర్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. సిగ్గు లేదా అంటూ బండారుపై ఆగ్రహం!
తెలంగాణలో కొత్త నాయకత్వం, కొత్త ప్రభుత్వం రావడం ఖాయం అని మురళి ధర్ రావు అన్నారు. కాంగ్రెస్ ఒక స్మోక్ స్క్రీన్.. కాంగ్రెస్ కు ప్రచారం చేస్తుందే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ A గేమ్ ఆడుతుంది, B గేమ్ ఆడుతుంది.. కాంగ్రెస్ ను నడిపిస్తున్న లీడర్ ఫ్రాంచైజ్ పర్సన్.. ట్రైబల్ వర్సిటీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉంది.. కేంద్రం ఇచ్చింది అని ఆయన చెప్పారు. కేంద్రం ఇస్తా అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోవడంతో ఆగి పోయాయి… టెక్స్ టైల్ పార్క్ లాంటివి.. పసుపు బోర్డ్ గురుంచి మాట్లాడింది మొదట మేమే.. మోడీ లేకపోతే పసుపు బోర్డ్ వచ్చేదే కాదు.. మేము ఏది చేసిన నేనే చేయించిన అని కవిత చెప్పుకుంటుంది.. మేము ఏమి చేయాలి.. రేపు ప్రభుత్వం కూలిపోయిన నేనే కారణం అనాలి.. కవిత అన్న తర్వాతనే మహిళలు ఉన్నారని మాకు తెలిసిందనుకుంటా.. ఏమీ చెబుతాం ఆమెకు అని మురళి ధర్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!