Muralidhar Rao: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు కోవర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏషియన్ గేమ్స్ లో వందకు పైగా పథకాలు సాధించడం వెనుక మోడీ కృషి ఉంది అని బీజేపీ నేత మురళి ధర్ రావు అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పని చేస్తుంది.. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించాము.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్.. సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్నారు.. ఇంతకన్నా కుటుంబ పాలన కు ఉదాహరణ ఏమీ కావాలి.. బావ బావమరిదులు రాష్ట్రాన్ని సగం సగం పంచుకున్నట్టు కనిపిస్తుంది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో కాన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తుంది.. మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వంద శాతం లబ్ది దారులకు చేరాయి.. టైం ప్రకారం డెలివరీ చేస్తుంది మోడీ సర్కార్ మాత్రమే అని మురళి ధర్ రావు తెలిపారు.
Read Also: PM Modi Speech: ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలపై ప్రధాని మోడీ సమీక్ష
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
మోడీ పథకాలకు కేసీఆర్ పథకాలకు మధ్య ఉన్న తేడాను ప్రజలకి వివరిస్తాము అని మురళి ధర్ రావు పేర్కొన్నారు. పూర్తి మెజారిటీ బీజేపీకి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. తెలంగాణ ప్రజలను ఎలక్షన్ సర్వేలు అంచనా వేయలేవు.. తెలంగాణలో యువత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంది.. కాంగ్రెస్ నమ్మకం లేని పార్టీ, భరోసా ఇవ్వలేని పార్టీ.. ఆ పార్టీ ది అరువు తెచ్చుకునే పరిస్థితి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళారీ వ్యవస్థ నడవాలనుకునే వారు లేని కాంగ్రెస్ ను పిక్చర్ లోకి తీసుకువస్తున్నారు.. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కోవర్ట్.. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే సమావేశం బీజేపీ కౌన్సిల్ లో జరిగింది అని మురళి ధర్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. సిగ్గు లేదా అంటూ బండారుపై ఆగ్రహం!
తెలంగాణలో కొత్త నాయకత్వం, కొత్త ప్రభుత్వం రావడం ఖాయం అని మురళి ధర్ రావు అన్నారు. కాంగ్రెస్ ఒక స్మోక్ స్క్రీన్.. కాంగ్రెస్ కు ప్రచారం చేస్తుందే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ A గేమ్ ఆడుతుంది, B గేమ్ ఆడుతుంది.. కాంగ్రెస్ ను నడిపిస్తున్న లీడర్ ఫ్రాంచైజ్ పర్సన్.. ట్రైబల్ వర్సిటీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉంది.. కేంద్రం ఇచ్చింది అని ఆయన చెప్పారు. కేంద్రం ఇస్తా అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోవడంతో ఆగి పోయాయి… టెక్స్ టైల్ పార్క్ లాంటివి.. పసుపు బోర్డ్ గురుంచి మాట్లాడింది మొదట మేమే.. మోడీ లేకపోతే పసుపు బోర్డ్ వచ్చేదే కాదు.. మేము ఏది చేసిన నేనే చేయించిన అని కవిత చెప్పుకుంటుంది.. మేము ఏమి చేయాలి.. రేపు ప్రభుత్వం కూలిపోయిన నేనే కారణం అనాలి.. కవిత అన్న తర్వాతనే మహిళలు ఉన్నారని మాకు తెలిసిందనుకుంటా.. ఏమీ చెబుతాం ఆమెకు అని మురళి ధర్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
-
Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!