Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnaw: భారతీయుల కలల ప్రాజెక్ట్ అయిన తొలి బులేట్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు ప్రస్తుతం రికార్డు స్థాయిలో శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. పనులు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదినాటికి సూరత్ – బిలిమోరా మధ్య మొదటి సెక్షన్ను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అలాగే వాపీ – సూరత్ సెక్షన్ సివిల్ నిర్మాణ పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
సుమారు 508 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ హైస్పీడ్ కారిడార్ను సెప్టెంబర్ 2017లో ప్రారంభించారు. ఇది మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నాగర్ హవేలీల గుండా సాగుతుంది. ప్రయాణికుల సదుపాయం కోసం ఈ మార్గంలో ముంబై, ఠాణే, విరార్, బోయిసర్, వాపీ, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్కతి అనే 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ల డిజైన్లను ఆయా నగరాల స్థానిక సంస్కృతి, గుర్తింపు ప్రతిబింబించేలా, ఆధునిక ఆర్కిటెక్చర్, మల్టీమోడల్ కనెక్టివిటీతో తీర్చిదిద్దుతున్నారు.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
ఇక రైలు పట్టాలపైనే కాకుండా, వాహనాల తయారీ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి కోచ్ ఇప్పటికే సిద్ధమైంది. గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణ సమయం కేవలం 2 గంటల 58 నిమిషాలకు తగ్గిపోతుంది. పూర్తి రక్షణ, మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ మార్గాన్ని రూపొందిస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఈ కారిడార్లో మొదటి పూర్తి స్థాయి బుల్లెట్ రైలు సర్వీస్ ఆగస్టు 2027లో ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా వచ్చే ఏడాది సూరత్-బిలిమోరా లైన్, డిసెంబర్ 2026 నాటికి వాపీ-సూరత్ సివిల్ నిర్మాణ లక్ష్యాలు పూర్తయితే భారత రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. ఈ మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్ పూర్తిస్థాయిలో డిసెంబర్ 2029 నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
-
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్తోనే కేఎల్ రాహుల్!
-
Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!