Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Ganesh Immersion: వర్షాలు లేకపోవడం, కృష్ణానదిలోనూ తగినంత నీటి లభ్యత లేకపోవడం ఇప్పుడు వినాయక నిమజ్జనంపై ప్రభావం పడుతోంది.. అయితే, వినాయక నిమజ్జనానికి కర్నూలులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సుంకేసులలో నీటి లభ్యత లేకపోవడంతో అక్కడి నుంచి కే.సి. కెనాల్కు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. దీంతో ప్రస్తుతం కే.సి. కెనాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హంద్రీనీవా కాలువలోని నన్నూర్ టోల్గేట్, తడకనపల్లె, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. హంద్రీనీవాకు మరో 12 నుంచి 14 రోజుల పాటు నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
5, 7వ రోజుల్లో నిమజ్జనానికి అనుకూలం
వినాయక నిమజ్జనానికి 5వ, 7వ, 9వ రోజుల్లో హంద్రీనీవాలో అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే 5వ, 7వ రోజుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజులు నిమజ్జనానికి అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పారు. 9వ రోజు నీటి లభ్యత ఎలా ఉంటుందో ఇప్పుడే ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదన్నారు భరత్.. నిమజ్జన కమిటీ మూడు ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పెద్ద విగ్రహాలను కమిటీ, అధికారులు ఎంపిక చేసిన ప్రాంతంలోనే నిమజ్జనం చేయాలని సూచించారు.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలి
ప్రజలు ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు ఉండే మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. చిన్న మట్టి విగ్రహాలను ఇంటి వద్దే నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
వర్షాల కోసం వరుణ యాగం
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించే అంశంపై కేబినెట్లో చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. కర్నూలులో గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. వర్షాలు కురిసి సుంకేసులకు నీరు చేరితే.. అక్కడి నుంచి కే.సి. కెనాల్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కే.సి. కెనాల్లో వినాయక నిమజ్జనం సాధ్యం కాదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. నీటి కొరత, వర్షాభావ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో నిమజ్జనానికి సహకరించాలని కోరారు మంత్రి టీజీ భరత్..
తాజావార్తలు
-
Arctic: ఆర్కిటిక్లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
-
Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
-
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
-
Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
-
Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!